DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శుక్రవారం మధ్యాహ్నం వరకూ ఆర్టీసీ బస్సుల నిలుపుదల 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 4, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీ కరణను వ్యతిరేకిస్తూ శుక్రవారం జేఏసి పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం సంఘీభావాన్ని ప్రకటించింది. తెలుగు ప్రజల పోరాటాలతో ఏర్పాటైన ఉక్కు పరిశ్రమ ప్రజల ఆస్తిగానే ఉండాలన్నదే

ప్రభుత్వ అభిమతమని రాష్ట్ర రవాణా,సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. రేపటి బంద్ పై ఆయన కొద్ది సేపటి క్రితం విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వ హించి మాట్లాడారు. తెలుగు ప్రజల పోరాటలకు ఫలితమే... విశాఖ ఉక్కు అని అన్నారు. దాన్ని ప్రైవేటీకరించకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అందులో భాగంగా ఇప్పటికే సిఎం జగన్

ప్రధానికి లేఖ రాశారన్నారు. శుక్రవారం నాటి రాష్ట్ర బంద్ కు ప్రభుత్వం సంఘీభావాన్ని ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. బంద్ కు సంఘీభావంగా రేపు మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలుపుదల చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. ఒంటి గంట తర్వాత బస్సుల రాకపోకలు యధావిధిగా సాగుతాయని అలాగే

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తారని మంత్రి వెల్లడించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam