DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రాలకు ఇచ్చిన కేంద్ర నిధులకు రాష్ట్రాలు లెక్క చెప్పాల్సిందే

*కేంద్ర నిధులతో అమలయ్యే పథకాలకు రాష్ట్రాల పేర్లు తగదు* 

*ఏపీ లోని కేంద్ర ప్రాజెక్ట్ లకు సొంత పేర్లు పై ఫిర్యాదులు వచ్చాయి.* 

*ఆంధ్ర లో కేవలం 14 శాతం పనులే జరిగాయి, నిరాశాజనకం*   

*వర్చువల్ ప్రెస్ మెట్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,

 బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 6, 2021  (డి ఎన్ ఎస్):* రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో అమలయ్యే పథకాలకు రాష్ట్రాలు పూర్తి లెక్కలు అప్పగించాలని, వాటికి తమ సొంత పేర్లు తగదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి హెచ్చరించారు. శనివారం విశాఖపట్నం లోని భారతీయ జనతా పార్టీ నగర

కార్యాలయం లో నిర్వహించిన వర్చువల్ ప్రెస్ మీట్ లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో అమలవుతున్న కేంద్ర ప్రాజెక్ట్ లకు సొంత పేర్లు పై ఫిర్యాదులు వచ్చాయి తెలిపారు. ఈ విధంగా చెయ్యడం రాష్ట్రాలకు సరికాదన్నారు. రాష్ట్రాలకు కేంద్రం కేటాయించిన ప్రతి రూపాయికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితంగా

లెక్క చెప్పి తీరాలన్నారు. లేని పక్షంలో తదుపరి నిధులు విడుదల కావన్నారు. ఆంధ్ర ప్రదేశ్ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకూ నిధులు, ప్రాజెక్ట్ లను ఎక్కడా లోటు లేకుండా ఇస్తున్నామన్నారు. ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్ గురించిన అంశాలకు తెలియచేసారు. 

ఆంధ్ర ప్రదేశ్ ను కేంద్రం ఒక మోడల్ గా తీసుకుందని, అందుకే మొట్టమొదట గా

స్మార్ట్ సిటీ నగరాల్లో విశాఖపట్నం కు స్థానం ఇచ్చామన్నారు. రెండవ దశ కేటాయింపుల్లో తిరుపతి, కాకినాడ, అమరావతి నగరాలను కూడా స్మార్ట్ సిటీ హోదాలోకి తీసుకువచ్చామన్నారు. ఆంధ్ర వేల కోట్లు నిధులతో ప్రాజెక్ట్ లను కేటాయించమని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 14 శాతం పనులే పూర్తి చేసిందని, ఈ రాష్ట్ర పనితీరు నిరాశాజనకం గా

ఉందన్నారు. 
స్మార్ట్ సిటీ పథకం కోసం భారీగా నిధులు ఇచ్చామని, నగర సుందరీకరణలో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజి, వీధి దీపాలు, సాగర తీరా సుందరీకరణ, లక్షలాదిగా ఇళ్ళు కేటాయింపులు, త్రాగు నీటి సదుపాయం,  పరిశ్రమల కోసం తగిన వసతులు ఎన్నో కేటాయింపులు చేశామన్నారు. రాష్ట్రాలకు నిధులు ఇచ్చేది అభివృద్ధి కోసమే తప్ప, కేంద్రం

పధకాల పేరు మార్చుకోమని కాదన్నారు. 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను పధకాల వారీగా కేంద్ర మంత్రి ప్రకటించారు. వాటిలో ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చెయ్యక పోవడం బాధాకరం అన్నారు. 
రాష్ట్రంలోని పేదప్రజలకు అందే ప్రతి ప్రాజెక్ట్ లోనూ ఫలితం నేరుగా లబ్ధిదారులకే అందాలని అని కేంద్రం

కార్యాచరణ చేస్తుందన్నారు. అయితే రాష్ట్రాల్లోని అధికార పార్టీ లు తమ స్వార్థం కోసం కేంద్ర పథకాలకు తమ పేర్లు, ఫోటోలు మార్చి సొంత లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రతి కేంద్ర పధకం పైనా వ్యక్తిగతంగా సమీక్ష చేయనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు.  

ఇటీవల కేంద్ర బడ్జెట్ లో

ఆర్ధిక శాఖామంత్రి నిర్మల సీతారామన్ రాష్ట్రాలకు అదనపు నిధులను కేటాయిస్తున్నట్టు ప్రకటించారన్నారు. 

దేశం లోని పేదప్రజలకు 20 లక్షల ఇళ్ల ను కేటాయించామని, మరికొంతమందికి బ్యాంకు రుణాలు కూడా లభిచేలా చర్యలు తీసుకున్నామన్నారు. అమృత్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ముద్ర రుణాలు, ఉపాధి శిక్షణ, తదితర ప్రయోజనాలను

అందిస్తున్నామన్నారు. త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ పర్యటించి అన్ని పథకాలపై పూర్తి సమీక్ష జరుపుతానని తెలిపారు.    

ఈ సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ ఎంపీ జివిఎల్ నరసింహారావు సమన్వయ పరిచారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్, ఎం ఎల్సీ పివిఎన్ మాధవ్, మాజీ ఎంపీ డా. హరిబాబు, బీజేపీ రాష్ట్ర

ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, జనసేన పరాధన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam