DNS Media | Latest News, Breaking News And Update In Telugu

15 నుంచి కోర్టుల్లో ప్రత్యక్ష విచారణకు సుప్రీం అనుమతి

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 6, 2021  (డి ఎన్ ఎస్):* సుమారు ఏడాది తర్వాత న్యాయస్థానాల్లో భౌతిక విచారణలు జరిపేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. పలు న్యాయస్థానాలు, ట్రిబ్యునల్స్‌ విజ్ఞప్తి మేరకు ఈ నెల 15 నుంచి న్యాయస్థానాల్లో భౌతిక విచారణలు జరిపేందుకు సుప్రీంకోర్టు

అనుమతించింది. ఈ మేరకు శనివారం ఉన్నతన్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. కొవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలతో కోర్టు కార్యకలాపాలు నిర్వహించాలని న్యాయస్థానాలకు సూచించింది.

కరోనా కారణంగా గతేడాది మార్చి నుంచి న్యాయస్థానాల్లో వర్చువల్‌ విధానంలోనే విచారణలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో

హైబ్రిడ్‌ (భౌతిక, వర్చువల్‌) విధానంలో కోర్టులు నిర్వహించేలా అనుమతినివ్వాలంటూ దేశవ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు ఉన్నతన్యాయస్థాన్ని విజ్ఞప్తి చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని భౌతిక, దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా కోర్టు కార్యకలాపాలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. చివరి దశ విచారణలో ఉన్న

కేసుల్లో మంగళ, బుధ, గురువారాల్లో పైలట్‌ ప్రాతిపదికన హైబ్రిడ్‌ విధానంలో విచారణలు చేపట్టాలని సుప్రీం ఆదేశాలిచ్చింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam