DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో బీజేపీ అభ్యర్థి పామ్ ప్లేట్ పై జగన్ ఫోటో మార్ఫింగా?

*విశాఖ లో అధికార పార్టీ దుర్మార్గం పరాకాష్టకు చేరింది : బీజేపీ*

*ఈ దుర్మార్గ పని పై సైబర్ క్రైం కి ఫిర్యాదు చేస్తున్నాం*

*బీజేపీ  మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మండిపాటు* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 7, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖ

నగరం లోని 14 వ వార్డ్ బీజేపీ అభ్యర్థి పామ్ ప్లేట్ పై జగన్ ఫోటో మార్ఫింగ్ చేసి, ప్రచారం చేస్తున్న అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలపై బీజేపీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దురాగతాలు. పరాకాష్టకు

చేరాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే. విష్ణు కుమార్ రాజు మండిపడ్డారు. ఆదివారం బీజేపీ నగర పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ GVMC పరిధిలో 14 వ వార్డు లో కచ్చితంగా గెలిచే అభ్యర్థి బీజేపీ - జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పరశురామ రాజు గెలుపుని అడ్డుకునేందుకు అధికార

పార్టీ అడ్డమైన గడ్డి తింటోందని మండిపడ్డారు. 

పామ్ ప్లేట్ పై జగన్ ఫోటో మార్ఫింగ్. . . . 

పరశురామ రాజు ప్రచారం కోసం తయారు చేసుకున్న పామ్ ప్లెట్ లో బీజేపీ నేతలు, జనసేన నేతల ఫోటో తో పాటు, బీజేపీ గుర్తు కమలం, జనసేన గుర్తులు ముద్రించామన్నారు. అయితే శనివారం రాత్రి కొందరు ఇదే పామ్ ప్లేట్ పై కమలం గుర్తు ను

తొలగించి ఫ్యాన్ గుర్తు ను, జనసేన నేత ఫోటో ప్లేస్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోటో ను ముద్రించి, పామ్ ప్లేట్ లు 14 వ వార్డ్ లో విస్తృతంగా ప్రచారం చేశారన్నారు.  

దీనిపై అధికార పార్టీ తీరుకు నిరసనగా ఈ దుర్మార్గపు ఘటనపై విశాఖ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. తక్షణం దీనిపై ఎన్నికల కమిషన్ కు కూడా

ఫిర్యాదు చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలియచేస్తున్నాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam