DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్నవరం కనకదుర్గ గుడిలో చండి హోమం ప్రారంభం

*ప్రతి నెలా మూలా నక్షత్రం నాడు నిర్వహించేలా ప్రణాళిక*   

*ఈ హోమం లో పాల్గొనవారు చెల్లించాల్సిన టికెట్ ధర రూ. 750*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 7, 2021  (డి ఎన్ ఎస్):* తూర్పు గోదావరి జిల్లా అన్నవరం లో వేంచేసిన రత్నగిరి శ్రీ వీర వేంకట సత్యనారాయణ

స్వామి దేవస్థానం పరిధిలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో అత్యంత వైభవంగా చండి హోమం ఆరంభమైంది. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం రత్నగిరి కొండ దిగువున ఉన్న కనకదుర్గ ఆలయంలో ఈ  చండి హోమాన్ని ఆరంభించినట్టు దేవస్థానం కల్యాణ బ్రహ్మ చామర్తి కన్నబాబు ( వెంకటరెడ్డి పంతులు) తెలియచేసారు. ఉదయం బ్రహ్మ మండపారాధన, చండి

మండపారాధన స్థాపన చేసి, ప్రత్యేక ఆరాధనలు చేసిన తదుపరి చండి హోమం శాస్త్ర బద్దంగా నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం కేవలం లక్ష కుంకుమార్చన జరుగుతోందని, ఇక పై ప్రతి నెలా మూలా నక్షత్రం నాడు సమాజ శ్రేయస్సు కోసం ఈ కనకదుర్గ ఆలయంలో చండి హోమం నిర్వహించే విధంగా దేవస్థానం ఈఓ వి. త్రినాధ్ రావు ఎంతో మంచి కార్యాచరణను ఏర్పాటు

చేసారన్నారు. ప్రతి నెల ఈ ఆలయంలో జరిగే ఈ హోమం లో పాల్గొన దలచిన భక్తులు రూ. 750 చెల్లించాల్సియుంది. 

అదే విధంగా రత్నగిరి పై ఉన్న వనదుర్గ ఆలయంలో ప్రతి శుక్రవారం చండి హోమం నిర్వహిస్తున్నారు. దీనికి టికెట్ ప్రస్తుతం రూ. 501 గా ఉంది, దీని ధర కూడా రూ. 750 కి పెంచటం జరిగింది. ఇదే ఆలయంలో ప్రతి పౌర్ణమికి ప్రత్యంగిరా హోమం

జరుపుతున్నారు.   

ఈ కార్యక్రమం లో ఆలయ చైర్మన్ రామ్ కుమార్, ఆలయ కార్యనిర్వహణాధికారి వి. త్రినాధ్ రావు, సహాయ కమిషనర్ రమేష్ బాబు, ట్రస్ట్ బోర్డు సభ్యులు చాగంటి సూరిబాబు, స్పెషల్ గ్రేడ్ పురోహితులు, కల్యాణ బ్రహ్మ నాగాభట్ల కామేశ్వర శర్మ, పట్టాభి, ప్రసాద్, ఏఈఓ దామెర్ల కృష్ణారావు, పండిత, వైదిక ప్రముఖులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam