DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏప్రిల్ 9 నుంచి 6 తటస్థ వేదికలపై ఐపీఎల్ పోటీలు  

*ఈసారి కూడా ప్రేక్షకులు లేకుండానే అన్ని మ్యాచ్ లు*  

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 7, 2021  (డి ఎన్ ఎస్):* క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్) 2021 తేదీలను భారత్ క్రికెట్ కౌన్సిల్ ఆదివారం ప్రకటించింది. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం

కానున్న ఈ పోటీలు కేవలం 6 వేదికలపైనే జరుగనున్నాయి. అయితే కరోనా మహమ్మారి ఇంకా పూర్తి రూపు మాపనందున ప్రేక్షకులు లేకుండానే  మ్యాచ్ లను నిర్వహించనున్నారు.  అన్ని మ్యాచ్ లు తటస్థ వేదికలపైనే జరుగనున్నాయి. ఈ మ్యాచ్ లకు వేదికలుగా చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోలకతా. ల్లో మ్యాచ్ లకు ఖరారు

చేసారు. 

మొత్తం 56 లీగ్ మ్యాచ్ ల్లో చెన్నై, ముంబై, కోల్కతా, బెంగుళూరు ల్లో తలో 10 మ్యాచ్ లు జరుగుతాయని, అహమ్మదాబాద్, ఢిల్లీ ల్లో తలో 8  మ్యాచ్ లు జరుగుతాయని ప్రకటించింది. 
ఏప్రిల్ 9 న మొదటి మ్యాచ్ చెన్నై లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగనుంది. 
మే 23 వరకూ లీగ్ మ్యాచ్ లు

జరుగుతాయని, తదుపరి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ మైదానం వేదిక గా మొదటి  క్యాలిఫైయర్ మ్యాచ్ మే 25 న, ఎలిమినేటర్ మ్యాచ్ మే 26 న, రెండవ క్యాలిఫైయర్ మ్యాచ్ మే 28 న, ఫైనల్ మ్యాచ్ మే 30 న జరుగుతుంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam