DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ గెలుపు తట్టుకోలేక జగన్ ఫోటో, వైకాపా గుర్తు తో మార్ఫింగా?

*ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే ప్రచారం చేస్తున్నాం:* 

*కరోనా కష్టకాలంలోనూ నిస్వార్ధ సేవలు అందించాం.*

*బీజేపీ - జనసేన 14 వ వార్డు అభ్యర్థి పరశురామ రాజు వెల్లడి.* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 7, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖ నగరంలోని 14 వ

వార్డులో గెలుపు దిశగా సాగుతున్న తనను ఎన్నికల బరిలో అడ్డుకునే ధైర్యం లేక, ప్రజల బలం లభించడం తట్టుకోలేని వాళ్ళు అధికార పార్టీ గుర్తు, వైఎస్ జగన్ ఫోటో తో మార్ఫింగ్ చేసి, దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ బిజేపీ - జనసేన 14 వ వార్డు అభ్యర్థి పరశురామ రాజు వెల్లడించారు. 
/> ఆదివారం బీజేపీ నగర పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారమే తాము ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టు నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురు సభ్యులతోనే ప్రచారం చేస్తున్నట్టు, ప్రచారం కూడా ఇంటింటికి వెళ్లి చేస్తున్నామని, పెద్దగా శబ్ద కాలుష్యం

కూడా చెయ్యడం లేదన్నారు. గత మూడు దశాబ్దాలుగా ఈ వార్డులో తానూ నివాసం ఉంటున్నానని, రెండు దశాబ్దాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. 

మా ప్రచార పామ్ ప్లేట్ ల పై తమ పార్టీ గుర్తు కమలం స్థానం లో ఫ్యాన్ గుర్తు ను పెట్టి, తమ ఉమ్మడి పార్టీ నేత ఫోటో స్థానంలో వైఎస్ జగన్ ఫోటో మార్ఫింగ్ చేసి వార్డులో

ఇంటింటికీ పామ్ ప్లేట్ లు పంచిపెడుతున్నారన్నారు. 

కరోనా కష్టకాలంలోనూ నిస్వార్ధ సేవలు . .

గత ఏడాది కరోనా కష్ట కాలంలో ఎందరికో ఆపదలో ఆడుకుని, ఆపన్నసమయంలో ఆసుపత్రిలో స్వయంగా చేర్పించి వైద్య సేవలు అందించి, వారు కోలుకునే విధంగా పూర్తి భాద్యతలు చేపట్టినట్టు తెలియచేసారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam