DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సరయు తీరంలో శ్రీరామ పారాయణ పూర్వజన్మ సుకృతం

*అయోధ్య చేరిన సప్తఋషి భారత వేద పరిక్రమ బృందం* 

*సప్తరుషి వేదపాఠశాల నిర్వాహకులు, మావిళ్ళపల్లి మాధవ శర్మ*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*అయోధ్య / విశాఖపట్నం, మార్చి 8, 2021  (డి ఎన్ ఎస్):* కోట్లాది మంది మానవులకు మార్గదర్శకంగా నిలిచినా శ్రీరామచంద్రుని జన్మ స్థలమైన

సరయు నదీ తీరం లోని అయోధ్య లో శ్రీమద్రామాయణ పారాయణ చేయడం పూర్వ జన్మ సుకృతమని ప్రముఖ వేదపండితులు, సప్తరుషి చారిటబుల్ ట్రస్ట్ వేదపాఠశాల నిర్వాహకులు, మావిళ్ళపల్లి మాధవ శర్మ తెలియచేస్తున్నారు. గత నెల 17 న విశాఖపట్నం లోని తమ పాఠశాల నుంచి బయలు దేరిన భారత వేదపరిక్రమ సోమవారం నాటికి అయోధ్య చేరుకుందని, పవిత్రమైన సరయు నదిలో

స్నానాదికాలు ముగించుకుని శ్రీరామ జన్మభూమి దర్శనానికి చేరుకుంటున్నట్టు తెలిపారు. శ్రీరాముని జన్మ స్థలమైన రామ జన్మభూమి ప్రాంతంలో శ్రీమద్రామాయణ చేయడం పూర్వ జన్మ సుకృతమన్నారు. తమ బృందంలోని వారంతా ఎంతో ఆనందానికి లోనవుతున్నట్టు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ దివ్య క్షేత్రాల్లో వేదపారాయణం ఇప్పడికే

పూర్తి చేశామన్నారు. ఆది శంకరులు చేపట్టిన భారత దేశ యాత్ర స్ఫూర్తిగా తాము కూడా నెల రోజుల పాటు ఈ భారత పరిక్రమ చేపట్టామన్నారు. మార్గమధ్యంలో ఎన్నో అనుభూతులు మరిచిపోలేనివి ఉన్నాయన్నారు. ఈ యాత్ర త్వరలోనే విశాఖ తిరిగి చేరుకుంటుందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam