DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఉక్కుతో రాష్ట్రానికి సంబంధం లేదు: కేంద్రం ప్రకటన

*విశాఖ స్టీల్ లో  ఏపీ కి ఈక్విటీ షేర్లు లేవు: నిర్మల సీతారామన్* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 8, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖ ఉక్కు కర్మాగారం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన

ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్‌ లేదని.. వందశాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్న ఆమె తేల్చిచెప్పారు. మెరుగైన ఉత్పాదకత కోసమే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రత్యక్ష,

పరోక్ష ఉపాధి పెంపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఏపీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. భాజపా మినహా అన్ని రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నాయి. ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో

ఇటీవల చేపట్టిన రాష్ట్ర బంద్‌ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం చర్చనీయాంశం కానుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam