DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యువత హరితంగా ఉంటె దేశం శక్తి వంతంగా ఉంటుంది 

రాజమహేంద్రి విద్యార్థులకు చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 8, 2021  (డి ఎన్ ఎస్):* యువత హరితంగా శక్తి వంతంగా వుంటే దేశం, రాష్ట్రం శక్తి వంతంగా వుంటుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉభయ వేదాంత ఆచార్య పీఠాధిపతులు, అపరరామానుజులు  త్రిదండి

చిన్న జీయర్ స్వామీ తెలిపారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ నేతృత్వంలో చేపట్టిన గో గ్రీన్ ఛాలెంజ్ యువత హరిత కార్యక్రమాన్ని అయన ప్రారంభించారు. స్థానిక లాలా చెరువు జంక్షన్ జరిగిన కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ హరిత విప్లవంతోనే మానవాళి, సర్వ జీవుల మనుగడ సాధ్యమని, తద్వారా

సమాజాభివృద్ధి చెందుతుందన్నారు. యువతకు ప్రకృతి రక్షణ పై అవగాహనా, భాద్యతల పై అవగాహనా కల్పించాల్సిన భాద్యత విద్యా సంస్థలు, ప్రభుత్వాలపై ఉందన్నారు. 
 రాజమండ్రి ఎంపి, మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ రాజమండ్రి నగరాన్ని వాతావరణ కాలుష్యం నుండి కాపాడటంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ హరిత యువత కార్యక్రమాన్ని

ప్రతిష్టాత్మకంగా చేపట్టామన్నారు.

భారత దేశంలో అత్యధిక ఉష్ణోగ్తత గల నగరం రాజమండ్రి అని, అటువంటి నగరాన్ని గ్రీన్ సిటీ గా, ఆక్సిజన్ సిటీ గా తీర్చిదిద్దడమే తన ప్రధాన సంకల్పమని చెప్పారు. సాంస్కృతిక రాజధానిగా భాసిల్లుతున్న రాజమహేంద్రవరాన్ని అన్ని హంగులతో అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి

చేస్తానన్నారు. 

కార్యక్రమం లో రాజమహేంద్రి మహిళా కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. . 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam