DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళల రక్షణ కే తోలి ప్రాధాన్యత : సీఎం వైఎస్ జగన్ 

*క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 8, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో మహిళల రక్షణకే తొలిప్రాధాన్యత ఇచ్చినట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.  సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో

నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళ అంటే ఆకాశంలో సగభాగమని.. ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా మహిళలకు హక్కులు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కుటుంబానికి చుక్కానిలా

ఉండి అందిస్తున్న సేవలకు కొలమానాలు లేవన్నారు.
 ఈ వేడుకల్లో మహిళా మంత్రులు తానేటి వనితా, మేకతోటి సుచరిత, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ పద్మ, మహిళా అధికారిణులు శ్రీలక్ష్మి, అనురాధ, కృతిక శుక్ల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam