DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉక్కు ఉద్యమం, గాజువాక హైవే దిగ్బంధం, ట్రాఫిక్ మళ్లింపు

*అనకాపల్లి నుంచి సబ్బవరం మీదుగా విశాఖ కు ట్రాఫిక్*  

*లంకెలపాలెం నుంచి కిలో మీటర్ మేర ట్రాఫిక్ జామ్.*

*రద్దీ పెరిగిన పెందుర్తి మార్గం, పలు చోట్ల ట్రాఫిక్ జామ్.*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 9, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖపట్నం స్టీల్

ప్లాంట్ లోని కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులను పూర్తిగా విమరించుకుంటున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో చేసిన ప్రకటనతో విశాఖ భగ్గుమంది. విశాఖ లోని గాజువాక హైవే మొత్తం దిగ్బంధం అవ్వడంతో లంకెలపాలెం ప్రాంతమంతా కార్మికులతో నిండిపోయింది. అనకాపల్లి నుంచి విశాఖ నగరానికి రావాల్సిన ట్రాఫిక్

ను సబ్బవరం మీదుగా మళ్లిస్తున్నారు. వెంకన్నపాలెం, సబ్బవరం, పెందుర్తి, గోపాలపట్నం, ఎన్ ఏ డి కూడలి మీదుగా విశాఖపట్నం సిటీ లోకి తరలించారు. మార్గమధ్యంలో అంతా ఇరుకు రోడ్లు కావడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. హైదరాబాద్, విజయవాడ నుంచి, విశాఖకు వస్తున్నా ప్రజా రవాణా సంస్థ బస్సులు, ప్రైవేట్ బస్సులు, భారీ రవాణా వాహనాలు

ఇదే మార్గం లో వస్తున్నాయి. అదే విధంగా శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలను ఆనందపురం, పెందుర్తి మార్గంలో అనకాపల్లి కి తరలించారు.  

లంకెల పాలెం ప్రాంతం నుంచి కిలోమీటర్ మేర ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ వాహనాల్లోనే నిత్యావసరాలు సరఫరా చేసే రవాణా వాహనాలు కూడా నిలిచిపోయాయి.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam