DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మెడికల్ కాలేజ్ నిధుల మంజూరుకు ఎంపీ భరత్ రామ్ విజ్ఞప్తి

*కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి హర్షవర్ధన్ ను కలిసిన వైకాపా ఎంపీ లు*

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 9, 2021  (డి ఎన్ ఎస్):* కేంద్రం నిర్దేశించిన జిల్లాకొక మెడికల్ కాలేజి లో భాగంగా ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ లో కేవలం మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే మంజూరయ్యాయని, వాటికి తక్షణం

నిధులు మంజూరు చెయ్యాలని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ,  వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ కు విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో  మంగళవారం ఉదయం కేంద్ర  ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు డాక్టర్ హర్షవర్ధన్ ను కలిసిన ఆయన మిగిలిన పది జిల్లాలకు

మెడికల్ కాలేజీలు మంజూరు చేయడం తో పాటు ఇప్పటికే మంజూరైన మూడు మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా నిధులను సత్వరం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీ లో అమలాపురం ఎంపీ అనురాధ, రాజ్య సభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ లు  వినతి పత్రాలు సమర్పించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam