DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చెత్త సేకరించే పారిశుధ్య కార్మికులూ సమాజ సేవకులే

*జిల్లా లీగల్ సర్వీసెస్ సంస్థ కార్యదర్శి హిమబిందు* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 9, 2021  (డి ఎన్ ఎస్):* చెత్త సేకరించే పారిశుధ్య కార్మికులు కూడా  వాళ్ళూ సమాజ సేవకులేనని, వారి పట్ల చిన్న చూపు చూడటం సరికాదని తూర్పు గోదావరి  జిల్లా న్యాయసేవాధికార సంస్థ (లీగల్

సర్వీసెస్)  కార్యదర్శి కె.వి.ఎల్. హిమబిందు అన్నారు. మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్థానిక ఆనం కళాకేంద్రం ఆవరణలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ, హరితదళం అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చెత్త సేకరించే వారికి న్యాయ విజ్ఞాన సదస్సు మరియు అవగాహన సదస్సు నిర్వహించారు. అసోసియేషన్ మేనేజర్ చిట్టిబాబు అధ్యక్షతన

జరిగిన కార్యక్రమానికి న్యాయమూర్తి హిమబిందు ముఖ్యతిధిగా విచ్చేశారు. మున్సిపల్ కార్పోరేషన్ సహకారంతో చెత్త సేకరించేవారికి గుర్తింపు కార్డులను అందజేశారు. అలాగే మహిళలకు చీరలు న్యాయమూర్తి హిమబిందు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి హిమబిందు మాట్లాడుతూ చెత్త సేకరించడమనే వృత్తి చేయడం గౌరవప్రధమైన

పని అని, వీళ్ళే లేకుంటే సమాజం చెత్తకుప్పగా మారిపోయేదన్నారు. ఇది కూడా సమాజానికి ళసేవ చేయడమని, మీరూ సమాజాభివృద్దిలో పాలి భాగస్తులని అన్నారు. ముఖ్యంగా దేశంలోనే అరుధుగా హరితదళం సంస్థ చెత్త సేకరించే వృత్తి చేసేవారినందరినీ ఒకే త్రాటిపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. అలాగే అందరికీ గుర్తింపుకార్డులివ్వడం, చీరలు

పంపిణీ చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆపన్నులను ఆదుకోడానికి న్యాయసేవాధికార సంస్థ ఉందని, ఎవరికి ఎటువంటి న్యాయసహాయం కావల్సినా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. అనంతరం వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam