DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ జిల్లా లో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి:  జిల్లా కలెక్టరు

*2020 మార్చి నెల నాటి ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 9, 2021  (డి ఎన్ ఎస్):* విశాఖపట్నం జిల్లాలో విశాఖ మహా నగరం మునిసిపల్ కార్పొరేషన్, నర్సీపట్నం, ఎలమంచిలి పరిధిలో మునిసిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని

జిల్లా ఎన్నికల అథారిటీ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పేర్కొన్నారు. మంగళవారం జివిఎంసి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతియుత, స్వేచ్ఛా వాతావరణంలో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని చెప్పారు. విశాఖ నగరంలో 98, ఎలమంచిలిలో 22, నర్సీపట్నంలో 28 మొత్తం 148 వార్డులు, జీవీఎంసీలో 1712,

ఎలమంచిలి 44 నర్సీపట్నం 56 మొత్తం 1812 కేంద్రాలలో పోలింగ్ జరుగుతుందన్నారు.

2020 మార్చి నెల నాటి ఓటర్ల జాబితా:. ..

    ఎన్నికల కమిషన్ ఆదేశాల ననుసరించి ఈ ఎన్నికలలో తేదీ 9-3-2020 ఓటర్ల జాబితా ప్రకారం  ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.  ఈ ఎన్నికల్లో 18,05,311మంది ఓటర్లు పాల్గొంటారని, 9,04,430 మంది పురుషులు కాగా

9,00,756 మంది స్త్రీలు, 125 మంది ఇతరులు ఉన్నారని తెలిపారు.  1712 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వాటిలో 240 సమస్యాత్మకమైన కేంద్రాలు, 654 అత్యంత సమస్యాత్మకమైన కేంద్రాలుగా గుర్తించామన్నారు. ఎలమంచిలిలో 44 పోలింగ్ కేంద్రాలలో 14 సమస్యాత్మక, 21 అత్యంత సమస్యాత్మకమైన కేంద్రాలు, నర్సీపట్నంలో 56 పోలింగ్ కేంద్రాలలో 22సమస్యాత్మక, 18 అత్యంత

సమస్యాత్మకమైన కేంద్రాలు వున్నట్లు చెప్పారు.  తగిన పోలీసు బందోబస్తుతో పాటు వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని, సూక్ష్మ పరిశీలకులతో పాటు మొత్తం 10,661 మంది పోలింగ్ అధికారులు, సిబ్బంది  పాల్గొంటున్నారని చెప్పారు.  జివియంసిలో 98 మంది, ఎలమంచిలి 6, నర్సీపట్నం 5 జోనల్ మేజిస్ట్రేట్స్, 216 మంది రూట్ ఆఫీసర్ లను

నియమించామని, బ్యాలట్ బాక్సులు జివియంసిలో 2957, ఎలమంచిలి 44, నర్సీపట్నం 56  మొత్తం 3057 బాక్సులు వాడుతున్నట్లు వెల్లడించారు.

 
86 శాతం పైగా వోటరు స్లిప్పుల పంపిణీ/ 
స్లిప్ లేకపోయినా వోటు వేయవచ్చు
జివియంసిలో 86.8 శాతం, ఎలమంచిలి 86.9 శాతం, నర్సీపట్నం 91 శాతం వోటర్ల స్లిప్పులు పంపిణీ జరిగిందన్నారు.  మిగిలనవి తాళం

వేసివున్నందున లేదా ఇల్లు మారినందున అందించలేక పోయారన్నారు. వోటరు జాబితాలో పేరు వున్నట్లయితే వోటరు స్లిప్పు లేక పోయినప్పటికీ ఎపిక్ కార్డు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ పోర్టు, పాన్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు కార్డు, పెన్షనర్ల  డాక్యుమంట్, ఫోటో వున్న ఎటియం కార్డు,రేషన్ కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకాలు,

స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు, సైనిక గుర్తింపు కార్డులు మొదలైన 20రకాల గుర్తింపు కార్డులను చూపించి తమ వోటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు.  ఎన్నికల నియమావళి మరింత పటిష్టంగా అమలుకు స్క్వాడ్స్, సర్వేలెన్స్ టీములను రెట్టింపు చేశామన్నారు.   ఎయూ ఇంజనీరింగ్ కళాశాలలో జివియంసి రిసెప్షన్ కేంద్రాలను ఏర్పాటు

చేయడం జరిగిందని,  ఎలమంచిలిలో ఇండోర్ స్టేడియంలో, నర్సీపట్నంలో ఎ.ఎస్.ఆర్. డిగ్రీకాలేజిలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 
ప్రతి వోటరూ  తమ ఓటుహక్కును వినియోగించుకోవాలి
2007లో జరిగిన జివియంసి ఎన్నికల్లో 52 శాతం వోటింగ్ మాత్రమే నమోదైనదని,  ప్రస్తుతం నగరం విస్తృతమైనదని, జనాభా పెరిగినందున  ఓటు కలిగిన ప్రతివారూ

తప్పక ఓటు వేయాలని, వోటింగ్ శాతం ఎక్కువగా వుంటే మంచి అభ్యర్దులను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు.  అందరికీ అందుబాటులో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
10వ తేదీన ఉద్యొగులకు శలవు లేదా పర్మిషన్
జిల్లాలో పురపాలక ఎన్నికలు జరుగుతున్న పట్టణాలు, నగరంలో  10వ తేదీన ఉద్యోగులు వోటు వేసేందుకు వీలుగా శలవు లేదా 3 గంటల

పర్మిషను  మంజూరు చేయమని ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టరు తెలిపారు. 
    ఈ సమావేశంలో నగర పోలీసు కమిషనరు మనీష్ కుమార్ సిన్హా,  పోలీసు సూపరింటెండెంట్  కృష్ణారావు, జివియంసి కమిషనరు నాగలక్ష్మి, డిసిపి ఐశ్వర్యారస్తోగి పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam