DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అపర శంకరులు, విశాఖ శారదా పీఠాధిపతులచే కుంభాభిషేకం

*విశాఖ లో వైభవంగా శివరాత్రి మహా కుంభాభిషేకం వేడుకలు*  

*విశాఖ బీచ్ లో హోరెత్తిన హర హర మహాదేవ.. శంభోశంకర. నినాదం* 

*రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలి: స్వరూపానందేంద్ర మహాస్వామి 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 11, 2021  (డి ఎన్ ఎస్):* మహా

శివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని మహా విశాఖ నగరంలోని సాగర తీరం హర హర మహాదేవ.. శంభోశంకర. నినాదాలతో హోరెత్తిపోయింది. అపర శంకరులు, సాక్షాత్తు నడిచే శివాంశ సంభూతునిగా హైందవ సమాజం చే కొనియాడబడుతున్న విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ప్రత్యక్షం కరకమలాలతో సాగర తీరంలో శివ

పరమాత్మకు మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. మాజీ ఎంపీ టి. సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యవంలో విశాఖ సాగర తీరంలో జరుగుతున్న మహా శివరాత్రి మహోత్సవాలను శారదా పీఠాధిపతులు ప్రారంభించారు. ఈ సందర్బంగా భారీ వేదికపై ఏర్పాటు చేసిన శివలింగ ప్రతిష్టకు మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. సుమారు రెండు గంటల

సమయం జరిగిన ఈ అభిషేకం అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి మాట్లాడుతూ ప్రస్తుతం దేశం , రాష్ట్రం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొని, మొత్తం ప్రజలందరూ సుఖ శాంతులతో వెలుగొందాలని, స్వామిని ప్రార్ధించినట్టు తెలిపారు.  

ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ మహాకుంభాభిషేకం వేడుకల్లో

భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గత ఏడాది కరోనా మహమ్మారి ప్రభావంతో ఈ వేడుకలను రద్దు చేయడం జరిగింది. గతంలో జరిగిన కార్యక్రమాల్లో వేలాదిగా భక్తులు కళాశాలతో తీసుకు వచ్చిన జలాన్ని స్వయంగా అభిషేకం చేసుకునే అదృష్టాన్ని కల్పించారు. 

ఈ ఏడాది కార్యక్రమాల్లో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి

స్వాత్మానందేంద్ర సరస్వతి, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam