DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బలమైన రాజకీయ పార్టీలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం: మాజీ ఎంపీ

*కనుమరుగైన లగడపాటి మరోసారి జన జీవన స్రవంతి లోకి* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 11, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో బలమైన రాజకీయ పార్టీలు ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఒక వైఫల్య ప్రజా ప్రతినిధిగా ఆంధ్ర

ప్రదేశ్ విభజనను అడ్డుకోలేని నాటి ఈమెపై లగడపాటి రాజగోపాల్ తదుపరి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అయితే చాలా కాలం తర్వాత బుధవారం విజయవాడ లోని ఓ పోలింగ్ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సడెన్‌గా విజయవాడలో ఓటేస్తూ కనిపించారు రాజగోపాల్. ఆయనను చూసి మీడియా ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు. ఏపీలో ప్రస్తుత రాజకీయాలపై

స్పందించాలని అడగడంతో తనదైన శైలిలో కామెంట్లు చేశారు లగడపాటి రాజగోపాల్.  జనసేనాని పవన్ కల్యాణ్‌ రాజకీయ శైలిని అభినందించారు లగడపాటి. ఓడినా ప్రజలను అంటి పెట్టుకుని ఉండటం అభినందనీయమన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయినా.. స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగడం ఆహ్వానించదగిన పరిణామమన్నారు రాజగోపాల్. ఇక సీఎం జగన్

గురించి కూడా ప్రస్తావించారు లగడపాటి. వైసీపీ పాలన ఎలా ఉందో మరో మూడేళ్ల తర్వాతే తెలుస్తుందని అన్నారు. రాజకీయాలకు ముందు నుంచే వైఎస్ జగన్‌తో స్నేహం ఉందని చెప్పారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కూడా లగడపాటి స్పందించారు. పోటీ వల్లే సంక్షేమానికి పార్టీలు పెద్ద పీట వేస్తున్నాయని లగడపాటి అభిప్రాయపడ్డారు. అభివృద్ధి,

సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయాలని సూచించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో సంక్షేమం, అభివృద్ధి సమంగా ఉండేవని లగడపాటి గుర్తు చేశారు. ప్రభుత్వాలు తమ అవసరాల మేరకు సంక్షేమం, అభివృద్ధిలో దేనికి ఎక్కువ కేటాయించాలో నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. తన రాజకీయ జీవితం, సర్వేలపై స్పందించారు లగడపాటి. ఇకముందు కూడా ప్రత్యక్ష

రాజకీయాల్లోకి మళ్లీ రాబోనని తేల్చి చెప్పేశారు. రాజకీయ సర్వేలకు కూడా దూరంగానే ఉంటానని స్పష్టం చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam