DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉపవాసం, జాగరణలే మహాశక్తి :సచ్చిదానంద సరస్వతి

*తుని తపోవనం లో శివయ్యకు శాస్త్రోక్త ఆరాధనలు*
 
*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 11, 2021  (డి ఎన్ ఎస్):*  మహాశివరాత్రి పర్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపవాసం, జాగరణ చేస్తూ, పరమేశ్వరుని సన్నిధిలో కాలక్షేపం చేస్తే మహాశక్తి లభిస్తుందని తూర్పుగోదావరి జిల్లా

తుని శివారు తపోవనం ఆశ్రమం పీఠాధిపతు సచ్చిదానంద సరస్వతి స్వామి తెలియచేసారు. గురువారం శివరాత్రి పూజలు ను ఆశ్రమ ఘనంగా నిర్వహించారు. వేద పండితులు, వేద విద్యార్థులు ఆధ్వర్యంలో వేదోక్తంగా పూజ గావించారు. వేకువజాము నుండే శివయ్యకు విశేషమైన పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.పంచామృత అభిషేకాలు,సప్త నదీజలాలతో అభిషేకించి

స్వామి వారికి ప్రీతిపాత్రులయ్యారు. శాస్త్రోక్తంగా వేదపండితులు  హోమపూజలు నిర్వహించి,పూర్ణాహుతి హోమద్రవ్యాలను సమర్పించి ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు.  ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు  తపోవనంలో వేంచేసివున్న  దైవతామూర్తలను దర్శించుకునేందుకు తరలివస్తున్నారు.నవగ్రహపూజలు,మృత్యుంజయుని

పూజలు,శివలింగాకారానికి 108 కలశాలతో అభిషేకాలు నిర్వహించి స్వామి వారికృపను పొందారు.   

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam