DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉక్కు పిడికిలి బిగుస్తోన్న విశాఖ ఉక్కు ఉద్యమం 

*సమ్మె నోటీసు ఇచ్చిన విశాఖ ఉక్కు పోరాట కమిటీ* 

*ఉద్యోగుల ఊపిరితో ఆటలాడొద్దు, కేంద్రానికే హెచ్చరిక* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 11, 2021  (డి ఎన్ ఎస్):* ఉక్కు ఉద్యోగుల ఆందోళన ఉక్కు పిడికిలి బిగుస్తోంది, ఉద్యమం ఉద్ధృతమవుతోంది. కేంద్ర

ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసు ఇచ్చింది. ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకోవాలని, సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందం రద్దు చేయాలని, పోస్కోతో జరిగిన ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ ఉక్కు సీఎండీకి గురువారం సమ్మె నోటీసు అందజేశారు. ఆర్‌-కార్డు ఉన్న

నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని ఉక్కుపరిరక్షణ పోరాట కమిటీ స్పష్టం చేసింది.

విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు, అమ్మేదెవరు... కొనేదెవరు..అంటూ ఉక్కు ఉద్యోగులు, నిర్వాసితులు, ఉద్యమకారులు నినాదాలతో గత కొన్ని రోజులుగా విశాఖలో

ఆందోళనలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తున్నామని సోమవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థికమంత్రి చేసిన ప్రకటనతో నిరసనలు మరింత ఉద్ధృతమైన విషయం తెలిసిందే. ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఉదయం స్టీలుప్లాంటు పరిపాలన భవనాన్ని ఉద్యోగులు ముట్టడించారు. ఈ క్రమంలో స్టీలుప్లాంటు డైరెక్టర్‌

(ఫైనాన్స్‌) వేణుగోపాలరావు రాగా.. ఆయన కారును చుట్టుముట్టి కదలకుండా ఆపేశారు. సుమారు ఆరు గంటల పాటు డైరెక్టర్‌తో పాటు హెచ్‌ఆర్‌ విభాగం ఈడీ బాలాజీని చెట్టు కిందే నిలబెట్టేశారు. ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam