DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ ఘోరవైఫల్యాలే జివిఎంసిలో కూర్చునే ఛాన్స్ కాలరాసాయా?

* స్వయంకృతాపరాధంతోనే గ్రేటర్ సభలో కాలదన్నుకుందా?*

*విశాఖ బరిలో ప్రచారం లేదు, ప్రజల్లో నమ్మకం లేదు, ఓటింగ్ లేదు.*

*మున్సి పోల్స్ లో డిపాజిట్లు దక్కితే . . .విశ్వవిజేతలు అయినట్టేనా?*

*బీజేపీ మితిమీరిన అత్యుత్సాహం. . .ప్రత్యర్థులకు బంపర్ విజయం?*

*14 వ వార్డు లో పరశురామ రాజు  గెలుపు

సైతం అనుమానమేనా. .?*

*14 న జివిఎంసి ఎన్నికల ఫలితాలపై ఏమాత్రం యోచనలేదా?*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 13, 2021  (డి ఎన్ ఎస్):* మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రజా ప్రతినిధుల స్థానాలకు ఈ నెల 10 న జరిగిన ఎన్నికల్లో గెలిచి పాలక మండలి లో స్థానం దక్కించుకునే

అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా కలదన్నుకున్నట్టుగానే కనపడుతోంది. ఆసియా లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహా నగరాల్లో ఒకటి గా స్థానం దక్కించుకున్న నగరం విశాఖపట్నం. అలాంటి నగరంలో చట్ట సభకు ప్రాతినిధ్యం వహించడం ఒక గౌరవంగా భావించబడుతోంది. ఈ నెల 14 న ఈ జివిఎంసి ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ

ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేనట్టుగా స్థానిక బీజేపీ ప్రతినిధులు ధీమాగా కనపడుతున్నారు. వీటిని ముందుగానే ఊహించినట్టుగానే కనపడుతోంది. దీనికి పూర్తిగా స్వయంకృతాపరాధంగానే చెప్పాలి. 

యావత్ భారత దేశంలోని ఎంతో ప్రాధాన్యత కల్గిన బీజేపీ అత్యధిక ఎంపీ లను గెలుచుకుని, కేంద్రం లో అధికారం సైతం వరుసగా రెండు సార్లు

చేపట్టింది. అదే పార్టీ కి చెందిన ఆంధ్ర ప్రదేశ్ శాఖా కనీసం ఏ గ్రామం లో కూడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోతోంది అంటే పూర్తిగా రాష్ట్ర కమిటీ అసమర్ధత గానే చెప్పాలి. 

14 వ వార్డు లో పరశురామ రాజు సైతం గెలుస్తారా?. . . . 

విశాఖ నగరంలో 14 వ వార్దులో బీజేపీ అభ్యర్థి పరశురామ రాజు పూర్తి మెజారిటీ తో గెలిచే

అభ్యర్థిగా బీజేపీ సహా, ఇతర రాజకీయ పార్టీలు సైతం లెక్కలు వేసుకున్నారు. అయితే ఈ వార్డులో అభ్యర్థి కేవలం వ్యక్తిగతం గా మాత్రమే ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేశారు తప్ప, బీజేపీ శ్రేణులను ఎక్కడా కలుపుకుని వెళ్ళకపోవడం గెలుపు అనుమానంగానే ఉంది. పైగా కేవలం రెండు రోజులు మాత్రమే ప్రచారం చెయ్యడం తో ఈయన గెలుపు ధీమా పార్టీ

వర్గాల్లో మితిమీరిన అత్యుత్సాహం ఫలితం ప్రత్యర్థులకు సంపూర్ణ విజయ అవకాశాన్ని కట్టబెట్టినట్టుగా ఉంది. 

జివిఎంసి వార్డుల్లో బీజేపీ కి అత్యధిక అభిమాన శ్రేణులు ఉన్న ప్రాంతాల్లో సైతం బీజేపీ అభ్యర్థులు తగిన ప్రచారం చెయ్యక పోవడంతో, ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గిపోయింది. చాలా ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు కూడా

ఎవరో తెలియక పోవడం గమనార్హం. 

తెలంగాణ లో బలం పై ఇక్కడ . . . . 

తెలంగాణగా లో బీజేపీ క్యాడర్ అవిశ్రాంతంగా చేసిన కృషి కారణం గా బీజేపీ కోలుకుని, జిహెచ్ఎంసి లో కొన్ని సీట్లు సాధించగలగింది. అయినప్పటికీ పార్టీ క్యాడర్ లో ఎక్కడా మితిమీరిన అత్యుత్సాహం కానరాలేదు. పార్టీ కి ఏమాత్రం సహకరించని కేంద్ర సహాయ

మంత్రి కిషన్ రెడ్డి ని సైతం ప్రక్కన పెట్టి. . .పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తదితరులు నిర్విరామ కృషి చేస్తున్నారు. దీని ఫలితమే తెలంగాణలో బీజేపీ ప్రతిపక్ష హోదా సాధించగలిగింది. 

అయితే. . తెలంగాణాలో బీజేపీ బలం చూసి, ఆంధ్ర లో గొప్పలు చెప్పుకోవడం తప్ప, chese కృషి

లేకపోవడం పూర్తిగా విధి నిర్వహణ వైఫల్యమే. .

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam