DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ బీజేపీ వెంటిలేటర్ నుంచి బయటపడే అవకాశం ఉందా?

*ఇతర రాష్ట్రాల్లోని BJP కి . . ఆంధ్ర లో BJP కి ఇదే తేడా. .*

*దేశమంతా ప్రభంజనం ఉన్నా. . .ఏపీ లో ఎందుకు విఫలం?*

*ఏపీ క్యాడర్ లో సమర్థులైన కార్యకర్తలే లేదా? గుర్తింపే లేదా?*

*ఏపీ భాజపా లో లోపాలు గుర్తించలేని నాయకులే కారణమా?* 

*బీజేపీ ఆంధ్ర శాఖా అంతా సంపూర్ణ ప్రక్షాళన తప్పని సరా?*

*(DNS

రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 15, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ వెంటిలేటర్ నుంచి బయటపడే అవకాశం ఉందా? అంటే అనుమానంగానే ఉంది. భారతీయ జనతా పార్టీ . . . దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతున్న రాజకీయ పార్టీ. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం కనుచూపు మేరలో కానరావడం లేదు. 
/> దేశ వ్యాప్తంగా బీజేపీ హవా పెరుగుతూ గత రెండు సార్లు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ నరేంద్ర మోడీ వరుసగా ప్రధానిగా ఎన్నికయ్యారు. 

దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ అత్యధిక సీట్లను గెలుచుకుని స్థానిక చట్టసభలకు ఎన్నికవుతుంటే. .. ఏపీ లో మాత్రం కనీసం గ్రామ స్థాయి లో కూడా పట్టుమని పది ఓట్లు కూడా

సాధించలేని దుస్థితిలో ఉంది. 

దీనికి ప్రధాన కారణం పార్టీ ప్రచారం కోసం సాధారణ కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుని వరకు అన్ని స్థాయిల నేతలు విశ్రాంతంగా కృషి చేస్తున్నారు. వీటికి అదనంగా ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలను ఆహ్వానించి, వారి సేవలను అద్వితీయంగా పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పధకాలను

ప్రజల్లోకి వెళ్లేలా ప్రచారం చేస్తు విజయాన్ని పొందుతూన్నారు. దీంతో ప్రజల్లో నమ్మకం కలుగుతోంది. 

అయి ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పరిస్థితి కనుచూపు మేరలో కూడా కానరాదు. రాష్ట్ర అధ్యక్షునికి సైతం ప్రజల్లో పెద్దగా ఆదరణ లేకపోవడం అతి పెద్ద లోటు. సాధారణ కార్యకర్తల్లో పార్టీ పట్ల ప్రచారం చేసే శక్తి, సత్తా ఉన్నప్పడికి

వాళ్లకి తగిన గుర్తింపు లేకపోవడం బీజేపీ ఆంధ్ర కి పెద్ద లోటు. 

దీనికి నిదర్శనమే. . .ఇటీవల జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన వాళ్లకి కనీసం డిపాజిట్లు కూడా రాక పోవడమే నిదర్శనం. 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖా వెంటిలేటర్ పై నుంచి లేచి కోలుకోవాలంటే. . .మొత్తం రాష్ట్ర కమిటీ ప్రక్షాళన

చెయ్యాల్సిన అవసరం ఉందనే వ్యాఖ్యలు సాక్షాత్తు బీజేపీ క్యాడర్ నుంచే వస్తుండడం గమనార్హం. 
 
తమిళనాడు లో . . .

ప్రస్తుతం తమిళనాడు లో జరుగుతున్నా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు కర్ణాటక కు చెందిన ఎంపీ, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ప్రచార భాద్యతలను తీసుకున్నారు. తమిళనాడు

లోని స్థానిక క్యాడర్, కార్యకర్తలను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తూ, పార్టీని బలోపేతం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఐపీఎస్ అధికారులను సైతం ఆకర్షించి వారిని ఎన్నికల బరిలో నిలిపారు. 

ఇదే పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ సైతం వస్తే తప్ప, బీజేపీ కి వెంటిలేటర్ నుంచి బయట పడే అవకాశమే లేదు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam