DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ మున్సిపోల్స్ విజయం విజయసాయికి గురు దక్షిణే

*జగన్ పాలన పై పట్ల ప్రజా కృతజ్ఞతకు ప్రత్యక్ష నిదర్శనమే విజయం.*

*వైజాగ్ స్టీల్ ఉద్యమం ప్రభావం వైకాపా పై కొంత చూపింది.* 

*విశాఖ పరిపాలనా రాజధాని గా ప్రకటించే ఎన్నికలకు వెళ్లాం*  

*విజయం పై అనకాపల్లి ఎమ్మెల్యే  గుడివాడ అమర్ ప్రకటన*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్,

విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 15, 2021  (డి ఎన్ ఎస్):* మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం రాజ్యసభ సభ్యులు వి. విజయసాయికి గురు దక్షిణ అందించగలిగామని అనకపల్లి ఎమ్మెల్యే  గుడివాడ అమర్ తెలియచేసారు. సోమవారం 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల

సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ద్వారా ప్రజలు వైఎస్ జగన్ పాలనకు తమ కృతజ్ఞత తెలియచేశారన్నారు. ప్రజల అండదండలు, పరిపాలన రాజదాని గా ప్రకటన చేసిన జరిగిన ఎన్నికల్లో ప్రజా తీర్పు ఇదే అన్నారు. 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేట్ పరం

చేస్తున్నట్టు వచ్చిన ప్రకటనలపై మొదలై వ్యతిరేక ఉద్యమం ప్రభావం మా పార్టీ చూపిందని, మా పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారన్నారు. అయితే. . .ఎన్నికల్లో జయాపజయాలు సామాన్యమన్నారు. గెలుపు స్థానిక అంశాలు, అభ్యర్థులను బట్టి కూడా ఉంటుందన్నారు. 

అమరావతి కేవలం ఒక శాసన సభ రాజధానిగా మాత్రమే ఉంటుందని, విశాఖపట్నం పరిపాలనా

రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు. దీనికి మద్దతుగానే అన్నిచోట్లా ప్రజలు వైఎస్ జగన్ కు ఓటు వేశారన్నారు. 

ఇక చంద్రబాబు ను రాష్ట్రం మొత్తం గా ఓటమి పలు చేసి, ఇంటికే పరిమితం చేశారన్నారు.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam