DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయసాయి చెంతకు చేరిన స్వతంత్ర కార్పొరేటర్లు

*వైకాపా గూటికి చేరిన జివిఎంసి నూతన కార్పొరేటర్లు?*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 15, 2021  (డి ఎన్ ఎస్):* గ్రేటారు విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా ఘన విజయం సాధించిన అభ్యర్థులు ఉత్తరాంధ్రా అధిపతిగా కొనియాడబడుతున్న

ఎంపీ విజయసాయి రెడ్డి చెంతకు చేరారు. ఆదివారం జివిఎంసి ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన వీరు సోమవారం ఉదయమే అధికార పార్టీ ఆశ్రయం కోసం అడుగులు వేశారు. వీళ్లంతా గతంలో అధికార పార్టీ నుంచి టికెట్లు ఆశించి భంగ పడినవారే కావడం గమనార్హం. ఎవరు ఎలా గెలిచినా, సభలో అధిక బలం ఉండాలనే సంకల్పం బలంగా ఉన్న అధికార పార్టీ ఆలోచన వీళ్లకు

బాగా కలిసి వచ్చింది. 

ఆదివారం వెలువడిన ఫలితాల్లో విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు సోమవారం ఉదయం తమ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ని కలిసాయి. ఈ సమయంలోనే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో  స్వంతత్ర అభ్యర్దులుగా విజయం సాధించిన  కందుల నాగరాజు, విల్లూరి భాస్కరరావు ఎమ్మెల్యే

వాసుపల్లి గణేష్ కుమార్ ను కలిశారు. వాసుపల్లి సారధ్యంలో వీళ్ళు విజయసాయి రెడ్డిని కలిశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam