DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రాలు చేసిన అప్పులు పదవీకాలం లోగానే తీర్చాలా?

*మోడీ నెక్స్ట్ టార్గెట్ రాష్ట్రాల అప్పులను అరికట్టడమేనా ?*

*పదవికాలంలోగా తీర్చకపోతే. .ఆస్తులు కుదువ పెట్టాలా?* 

*పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ, ఊహాగానమా? వాస్తవమేనా?*

*ఇదే నిజమైతే. . పార్టీల ఉచిత పథకాలకు చెల్లు చీటీయే. . .*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

 

*విశాఖపట్నం, మార్చి 16, 2021  (డి ఎన్ ఎస్):* దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో చక్కని ప్రణాళికకు రంగం సిద్ధం చేస్తున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. అదే నిజమైతే. . .రాష్ట్రాల్లోని పార్టీ అమలు చేస్తున్న ఉచిత కానుకలు ఇకపై చెల్లు చీటీయే పలుకనుంది. 

వివిధ రాష్ట్రాల

ప్రభుత్వం తమ ఎన్నికల హామీల అమలు కోసం చేస్తున్న అప్పులను, వాళ్ళ ప్రదవి కాలంలోగానీ తీర్చాల్సి ఉంటుంది. లేని పక్షంలో అంతవరకూ ప్రభుత్వంలో unna పాలకుల సొంత ఆస్తులను కుదువ పెట్టి, అప్పు తీర్చాల్సి ఉంటుంది. లేని పక్షంలో రాష్ట్రాలపై చర్యలకు కేంద్ర సిద్ధం కానుంది. ప్రస్తుతం ఈ అంశం లో అధికార పార్టీ నుంచి ఊహాగానాలు గా

వస్తున్నప్పడికి నరేంద్ర మోడీ సంస్కరణ వైఖరి చూస్తుంటే త్వరలోనే ఈ అంశం అమలు లోకి వాచేలాగానే కనపడుతోంది.  

కోట్లకు కోట్లు దాటుతున్న ఉచితాల వ్యవమ్: . .

ఎన్నికల్లో గెలిచేందుకు దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు ఎన్నో పధకాలు ఉచితంగా అందించేందుకు హామీలను ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నాయి.

కొన్ని రాష్ట్రాల్లో ఉచిత టీవీలు, విదేశీ విద్య, ఇంటికో ఇల్లు- ఆపై రాయితీ, కల్యాణ లక్ష్మి,  అమ్మఒడి, కార్పొరేషన్లు పధకాలు, ఉచిత ఇల్లు, ఉచిత గ్యాసు, ఉచిత లాప్ టాప్ లు, కంప్యూటర్లు, ఇలా పథకాలన్నింటి  అమలు చెయ్యడానికి ప్రభుత్వం తరపున కోట్లాది నిధులను అప్పులు చేసి, ప్రజలలో మార్కులు కొట్టేస్తున్నారు. 

తద్వారా

aayaa రాష్ట్రాలు చేస్తున్న అప్పులు ప్రతి ఏడాదికి భారీగా పెరిగి, ప్రజల నెత్తిన పన్నుల భారాన్ని మోపుతున్నారు. 

దీన్ని అదుపు చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు, ఆ ప్రభుత్వ పరిపాలన పదవీకాలం ముగిసే లోనే కచ్చితంగా తీర్చాల్సి ఉంటుంది. లేని పక్షంలో హామీలు ఇచ్చిన వాళ్ళ సొంత

ఆస్తులను కుదువ పెట్టి మరీ అప్పులు తీర్చాలి ఉంటుంది. 

ఇప్పడి వరకూ గత ప్రభుత్వాలు చేసిన అప్పులు ప్రక్కన బెట్టి, మళ్ళీ కొత్తగా అప్పులు చేస్తూ, రాష్ట్రాలపై మరింత భారాన్ని పెంచేస్తుండడం తో  చక్రవడ్డీ లు కట్టడానికి రాష్ట్రాలకు నిధులు ఉండడం లేదు. ఇదే ప్రస్తుతం, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటం లో

పెడుతోంది. 

ఇదే ప్రస్తుతం బీజేపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే ఇది వాస్తవం లోకి వచ్చే అవకాశం ఉందా? లేక కేవలం ఊహాగానమా అనేది తెలియాల్సి ఉంది. 

ఇదే కనుక అమలు లోకి వస్తే. .. ఏ రాష్ట్రంలోనూ ఉచితం పేరిట ఒక్క పధకం కూడా అమలు కాదు. ఎన్నికల్లో మానిఫెస్టోలో హామీల పేరిట నిధుల దోపిడీ లకు పూర్తి

అడ్డుకట్ట కడుతుంది. 

ఖర్చులు తగ్గించే పనిలో భాగంగా ఇప్పడికే ఎంపీలకు ఢిల్లీ లో ఇచ్చే సదుపాయాలపై వేటు వేసిన కేంద్రం, త్వరలోనే వాళ్ళ మిగిలిన వసతులపై కూడా దృష్టి సారించనుంది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam