DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు పై సీఐడీ కేసు 

*41 సిఆర్ పిసి చట్టం, అట్రాసిటీ కేసులు కూడా నమోదు* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 16, 2021  (డి ఎన్ ఎస్):* గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రాజధాని కోసం తీసుకున్న అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు పై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసారు.

మంగళవారం హైద్రాబాద్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి నోటీసులను అందించారు. ఈ కేసులో టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సహా మాజీ మంత్రి నారాయణలపై సైతం సీఐడీ అధికారులు కేసులు నమోదు చేసారు. కాబినెట్ ఆమోదం లేకుండానే అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ లో చేర్చడంపై  సీఐడీ కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు కి

రాజధాని భూముల అక్రమాలకు సిఐడి నోటీసులు అందించిన అధికారులు, విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ అయ్యాయి. దళితులకు కేటాయించిన భూములు రాజధాని ప్రకటనకు ముందు ఇతరుల కొనుగోలు కూడా ఉంది. భూ సమీకరణ ప్రకటించిన తర్వాత వాటిని కాబినెట్ అనుమతి లేకుండానే బదలాయింపు కి అనుమతించిన చంద్రబాబు ప్రభుత్వం తీసుకుందన్నది

అభియోగం. దాదాపు 500ఎకరాల అసైన్డ్ భూముల కొనుగోళ్ళను వన్ టైమ్ సెటిల్మెంట్ లో క్రమబద్దీకరించినట్టు అభియోగం. అధికారుల అభ్యంతరాలు, సూచనలు పట్టించుకోకుండా చైర్మన్ హోదాలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 41 సిఆర్ పిసి  కింద విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ అయ్యాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam