DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*రాజమండ్రి లో 100 పడకల ఇఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం*

*asupatri నిర్మాణానికి రు.98 కోట్ల నిధులు మంజూరు*

*నెలాఖరున శంకుస్థాపనకు కేంద్ర మంత్రి గంగావార్ రాక* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 16, 2021  (డి ఎన్ ఎస్):* తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సుమారు రు. 98 కోట్ల నిధులతో నిర్మించనున్న అత్యాధునిక కొత్త ఈఎస్ఐ భవన

 నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు సంతోష్ కుమార్ గంగ్వార్ రాజమహేంద్రవరం రానున్నారని  రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి ఎంపీ భరత్ రామ్ మంగళవారం మీడియా కు తెలియజేశారు. కేంద్ర కార్మిక శాఖ మాత్యులు సంతోష్

కుమార్ గంగ్వార్ ను ఈ మేరకు న్యూ ఢిల్లీ లో మంగళవారం తాను కలిసి విజ్ఞప్తి చేసినట్టు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఈనెలాఖరున శంకుస్థాపనకు వచ్చేందుకు మంత్రి అంగీకరించడంతో పర్యటన ఖరారు అయిందని ఎంపీ భరత్ రామ్ తెలియజేశారు. 

రాజమహేంద్రవరం లోని ఏపీ పేపర్ మిల్లు ఎదురుగా అత్యాధునిక ఆసుపత్రి నిర్మాణంతో పాటు, 32 మంది

సిబ్బంది నివసించడానికి వీలుగా క్వార్టర్ల నిర్మాణం చేస్తారన్నారని ఎంపీ భరత్ రామ్ వివరించారు. రాజమహేంద్రవరం లోని సువిశాలమైన ఆస్పత్రి స్థల ప్రాంగణంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలతో ఈ అత్యాధునిక ఇఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం జరగడం ఉన్నట్టు ఎంపీ వివరించారు. 

జాతీయ స్థాయి వైద్య

ప్రమాణాలతో స్కానింగ్, ఎమ్ఆర్ఐ, ఎక్సెరే తదితర వైద్య సదుపాయాలు, ఉన్నత ప్రమాణాలు కలిగిన వైద్య ఇన్ఫేషెంట్ సదుపాయాలతో ఈ ఈ ఎస్ ఐ ఆసుపత్రి నిర్మాణం జరగనున్నట్టు చెప్పారు. సుమారు మూడున్నర ఎకరాల సువిశాల స్ధలంలో నిర్మించే ఈ ఆసుపత్రికి అవసరమైన నిధులు ఇప్పటికే మంజూరు జరిగిందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam