DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి ప్రసాదం లడ్డు మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి

*తిరుమల వాసునికి అందించే తిరు నైవేద్యాలు ఇవే*

*డా. రమణ దీక్షితుల పుస్తక ప్రచురణలో వెల్లడి.* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 18, 2021  (డి ఎన్ ఎస్):* కోట్లాది మంది హిందూ భక్తుల ఆరాధ్యదైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరునికి ఇచ్చే నైవేద్యం అంటే కేవలం లడ్డు

ప్రసాదం అని మాత్రమే భావించే భక్తులందరికీ తెలియాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో అత్యంత ప్రధానమైనవి స్వామికి ప్రతి రోజు అందించే తిరువైద్యాలను తెలియచేస్తూ తిరుమల శ్రీవారి మూలవిరాట్ కొలువైన ఆనందానిలయం లో పూర్వ  ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు రచించిన సేక్రెడ్‌ ఫుడ్స్‌ ఆఫ్‌ గాడ్ ఆధారంగా ఈ వివరాలను

అందిస్తున్నాం. 

అత్యంత శుచిగా, ఆగమ శాస్త్రబద్ధంగా వంటను తయారు చేసి, స్వామికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. 

 
ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలను మాత్రమే ఉపయోగిస్తారు. ప్రసాదం తయారు చేసేవారు సామాగ్రిని వాసనా చూడడం గానీ, రుచి చూడడం గానీ చెయ్యరు. అందుకే వారు

వాసన సోకకుండా ముక్కు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. శ్రీవారి ఆలయంలోకి వెళ్ళేదాకా ఎవ్వరూ చూడకూడదు.

నైవేద్యం జరిగినంత సేపూ ఆలయంలో ఘంటానాదం జరుగుతూనే ఉంటుంది. రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య బాలభోగం సమర్పిస్తారు. పది, పదకొండు గంటల మధ్య రాజభోగం, రాత్రి

ఏడు - ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారు. 

తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తు 9.5 అడుగులు. దీనికి అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు. స్వామికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఉచ్చిష్టం భక్తులకు పంచుతారు. 

నైవేద్యంలో అన్ని రకాల

అన్న ప్రసాదాలు, ఇతర ప్రత్యేక వంటకాలు అందింస్తారు. 
అల్పాహారాలు : లడ్డు, వడ, అప్పం, దోసె లను అందిస్తారు. 

ప్రతి రోజు స్వామికి అందించే ఆహార క్రమం ఇదే:. . .

ఉదయం సుప్రభాతం సమయంలో అప్పుడే తీసిన చిక్కని వెన్న నురుగు తేలే ఆవుపాలు సమర్పిస్తారు. 
తోమాల, సహస్రనామ అర్చన సేవల తరువాత నువ్వులు, సొంఠి

కలిపిన బెల్లం నైవేద్యంగా పెడుతారు. తదుపరి బాలభోగం సమర్పిస్తారు. 

ఉదయం బాలభోగం : ఉదయం ఆరాధనలు అనంతరం ఉదయం 6 గంటల ప్రాంతంలో మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి

అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. 

మధ్యాహ్నం రాజభోగం :

శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గూడాన్నం, దద్యోజనం, శీర లేక చక్కెరన్నం

సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి... స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. 

రాత్రి శయనభోగం : మరీచ్యఅన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ, శాకాన్నం(వివిధ కూరగాయలతో కలిపి

వండిన అన్నం)

అర్ధరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం (శుద్ధాన్నం, గూడాన్నం) పెడతారు. 

పవళించే సమయం ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేంచిన బాదం, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు.

ప్రసాదం లో వినియోగించే సామాగ్రి ఇవే: 

బియ్యం, ధాన్యాలు, ఆవు పాల

పదార్థాలు, ఔషధ గుణాలున్న వస్తువులు, వనస్పతులు, లవంగాలు, యాలకులు, తులసి, మిరియాలు. 

ఈయన తిరుమల క్షేత్రం తో ఉన్న అనుభవాలన్నిటినీ పుస్తక రూపంలో పొందుపరిచినట్టు తెలియచేసారు. ఈ పుస్తకంపై వచ్చే రాయల్టీని తిరుమలలోని అన్నప్రసాద పథకానికి ఇవ్వాలని సంకల్పించినట్టు తెలిపారు. ఆంగ్లం లో ప్రచురితమైన ఈ పుస్తకాన్ని

నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారన్నారు. త్వరలో తెలుగు, తమిళం, హిందీ, ఇతర భాషల్లో విడుదల చేయటానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam