DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కుగ్రామాల్లో మంచి నీటి సమస్య పరిష్కారానికి చర్యలు 

*ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ వెల్లడి*

*విశాఖపట్నం, మార్చి 19, 2021  (డి ఎన్ ఎస్):* రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న కుగ్రామాల్లో సైతం మంచి నీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చక్కని ప్రణాళిక రూపొందించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి,  రెవెన్యూ,  స్టాంపులు,

 రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ పేర్కొన్నారు. 

శుక్రవారం రాజమండ్రి రూరల్ కాతేరు గ్రామంలో ఏపీ పేపర్ మిల్లు సిఎస్సార్ నిధులు రూరల్.1.5 కోట్లతో నిర్మించిన మంచి నీటి ప్రాజెక్ట్ ను ఎంపి మార్గాని భరత్ రామ్,  మంత్రులు ధర్మాన కృష్ణ దాస్,  చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ప్రారంభించారు.  ఈ సందర్భంగా

ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మారు మూల ప్రాంతాల్లో వచ్చే వేసవిలో మంచి నీటి సమస్య లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.  ఇందు కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు వెళ్ళడించారు. త్వరలోనే ఇంటింటికీ మంచి నీరు సరఫరా అయ్యేలా

ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ధర్మాన తెలిపారు. 

మరో ముఖ్య అతిథి ఎంపి మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ కాతేరు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సైతం ప్రస్తుతం ఏపీ పేపర్ మిల్లు సిఎస్సార్ నిధులతో నిర్మించిన వాటర్ ప్రాజెక్ట్ ద్వారా సమృద్ధిగా మంచి నీరు సరఫరా అవుతుందన్నారు.  ఈ ప్రాజెక్ట్ పనులు

సంవత్సరం క్రితమే ప్రారంభమైనా కరోనా కారణంగా పనులకు ఆటంకం ఏర్పడిందని,  అయినా త్వరితగతిన పనులు పూర్తి చేసుకుని ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషమన్నారు. ఇందుకు ఎంతగానో శ్రద్ధ వహించిన పేపర్ మిల్లు యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.  తొలుత వాటర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ముఖ్య అతిథులు ఎంపి భరత్

రామ్,  మంత్రులు ధర్మాన,  చెల్లుబోయిన, ఎమ్మెల్యే గోరంట్ల, పేపర్ మిల్లు యాజమాన్యం సురపు రెడ్డి, మధు శ్రీ, రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ తదితరులు ఆవిష్కరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam