DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రామతీర్ధం హుండీ లెక్కింపు లో నిర్లక్ష్యం, డీసీ, ఏసీలు సస్పెండ్

*దేవాదాయశాఖ భ్రష్టుపట్టిందనడానికి మరో నిదర్శనం*

*డీసీ డ్రైవర్ చేతివాటం, మూడు వేలు, మంగళసూత్రం మాయం* 

*విశాఖ దేవాదాయ శాఖా డీసీ సహా  ముగ్గురు సస్పెండ్*

*విశాఖ దేవాదాయశాఖ డీసీగా జ్యోతి మాధవి బాధ్యతల స్వీకరణ* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

 

*విశాఖపట్నం, మార్చి 19, 2021  (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లోని దేవాదాయ శాఖా పూర్తిగా భ్రష్టుపట్టింది అనడానికి మరొక ప్రత్యక్ష నిదర్శనం దర్శనమిచ్చింది. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా విశాఖపట్నం దేవాదాయ శాఖ ఉప కమిషనర్ సుజాత, విజయనగరం సహాయ కమిషనర్ రంగారావు, ఇంచార్జి రాజారావులను తక్షణం సస్పెండ్ చేస్తున్నట్టు

రాష్ట్ర దేవాదాయ శాఖాకమిషనర్ అర్జున్ రావు ఆదేశాలు జారీ చేసారు. వివరాల్లోకి వెళితే. . .

ఉత్తరాంధ్ర అయోధ్యగా పేరుగాంచిన విజయనగరం జిల్లా లోని ప్రఖ్యాత రామతీర్ధం రామాలయంలోని హుండీ లెక్కింపుల్లో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నందున ముగ్గురిని సస్పెండ్ చేసారు. హుండీ లెక్కింపుల్లో ఎంపిక చేసిన ఉద్యోగులు

తప్ప ఇంకెవ్వరూ లోపల ఉండరాదు. అయితే డీసీ సుజాత వెంట ఆమె కారు డ్రైవర్ కూడా రావడమే కాక, మూడు వేలు రూపాయల నగదు, ఒక మంగళసూత్రం పై చేతివాటం ప్రదర్శించడంతో సుజాత పై వేటు పడింది. ఇక విధుల్లో ఉండవలసిన విజయనగరం సహాయ కమిషనర్ రంగారావు విధులకు రాకుండా ఇంచార్జి రాజారావు ను పంపడంతో వారిద్దరిని సస్పెండ్ చేసారు.  
విశాఖపట్నం ఉప

కమిషనర్ గా ఎస్. జ్యోతి మాధవి కి భాద్యతలు అప్పగించారు. శనివారం ఆమె భాద్యతలను స్వీకరించారు. ప్రస్తుతం ఈమె విశాఖ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈఓ గా సేవలు అందిస్తున్నారు. డీసీ గా భాద్యతలు తీసుకోగానే రామతీర్థం ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు. 

గత ఏడాది ఇదే రామతీర్ధం ఆలయంలోని బోడికొండపై గల ఆలయంలో

శ్రీరాముని విగ్రహాన్ని భిన్నం చేసిన ఘటనలో దోషులు ఎవరో తేలక ముందే అదే ఆలయంలో అధికారులు విధుల్లో పూర్తి నిర్లక్ష్యం గా ఉండడం పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ లో ఉద్యోగులకు భాద్యత లేకుండా పోయిందనే వ్యాఖ్యలు వ్యక్తమవుతున్నాయి.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam