DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీస్ స్టేషన్​లో నగదు మాయం చేసింది కానిస్టేబుళ్లే 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 20, 2021  (డి ఎన్ ఎస్):* పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్​లో నగదు మాయం చేసింది స్థానిక కానిస్టేబుళ్లేనని పోలీసులు తెలిపారు. ఛేదించిన కేసు వివరాలను శనివారం ప్రకటించారు. ఈ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లు గంగాజలం, గణేశ్వర్‌రావును

అరెస్టు చేసినట్లు ఎస్పీ నారాయణ నాయక్‌ తెలిపారు. నిందితుల నుంచి రూ.8.04 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఆ ఇద్దరిపై గతంలోనూ నేరారోపణలు ఉన్నాయన్నారు. వీరవాసరం మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది.  ఈ మధ్య మూడు రోజులు బ్యాంకులకు సెలవు కావడంతో మద్యం దుకాణాల అమ్మకం సొమ్ము సుమారు

రూ.8 లక్షలను పోలీస్ స్టేషన్​లో భద్రపరిచారు. బ్యాంకులు తెరిచిన తర్వాత పోలీస్‌స్టేషన్‌లో భద్రపరచిన డబ్బు కోసం వైన్ షాపుల సిబ్బంది వెళ్లగా..లాకర్​లో ఉంచిన నగదు కనిపించలేదు. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు పోలీసు స్టేషన్​లో డబ్బు మాయమైన ఘటనపై విచారణ చేపట్టారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam