DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ? లేక శ్రీనివాసులా?

*బీజేపీ అభ్యర్థి ఐఏఎస్సే గానే ఖరారు. . . ఇతరులకు నో ఛాన్స్* 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 22, 2021  (డి ఎన్ ఎస్):* తిరుపతి లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుండడంతో అన్ని రాజకీయా పార్టీల్లోనూ వేడి అంటుకుంది. ఇప్పడికే అధికార వైఎస్ ఆర్

కాంగ్రెస్ పార్టీ గురుమూర్తి పేరును ఖరారు చెయ్యగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఇంకా ఖరారు చెయ్యలేదు. అయితే బీజేపీ తరపున విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి మాత్రం పోటీలో ఉంటారని తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గా అత్యుత్తమ సేవలు అందించిన కె. రత్నప్రభ పేరును బీజేపీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

పార్టీ అధికారికంగా ఇంతవరకూ ప్రకటించలేదు. దీనికి ప్రధాన కారణం రత్నప్రభ ఆంధ్ర ప్రదేశ్ లోనూ చాలా సంవత్సరాలు విధులు నిర్వహించారు. ఆమెకు నిజాయితీ గల అధికారిగా పేరు తో పాటు,  ఎందరికో స్ఫూర్తిగా, ఆదర్శంగాను నిలిచారు. విశాఖపట్నం లోని స్పెషల్ ఎకనామిక్ జోన్ కమిషనర్ గా ఆమె అందించిన సేవలకు నేటికీ ఆమె పట్ల విశాఖ వాసులు

కృతజ్ఞతా చూపుతుంటారు. మహిళగా ప్రధాన అవకాశం ఆమెకు ఇచ్చే అవకాశం ఉంది. అయితే మరో విశ్రాంత అధికారి దాసరి శ్రీనివాసులు పేరు కూడా ఇదే స్థాయిలో వినపడుతోంది. ఈయన కూడా మంచి అధికారిగా, నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. వీరుకూడా ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నో హోదాల్లో సేవలు అందించి, రాష్ట్ర అభివృద్ధికి నిలువెత్తు సాక్షిగా నిలిచారు.

వీరి పట్ల కూడా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి వ్యక్తిగత ప్రతిష్ఠా కు బీజేపీ కేంద్ర ప్రభుత్వం లో అందించిన ఎన్నో పధకాలు భారీ విజయాన్ని అందిస్తాయని నమ్మకం బీజేపీ కేంద్ర అధిష్టానం లో ఉంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam