DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జెపీ పవర్ కు కట్టబెట్టిన ఇసుక టెండర్ రద్దు చెయ్యాలి: బీజేపీ 

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 23, 2021  (డి ఎన్ ఎస్):* జెపీ పవర్‌ కు కట్టబెట్టిన ఇసుక వ్యాపార కాంట్రాక్టును తక్షణం రద్దుచేయాలని, పేదలకు ఉచితంగా ఇసుకను ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇసుక టెండర్ కు వ్యతిరేకంగా బీజేపీ మంగళవారం ఉదయం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేసింది. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నాలుగో పాలసీగా ఇసుకను అమ్మేందుకు జెపీ పవర్‌ కంపెనీకి

కాంట్రాక్టును కట్టబెట్టడం సరికాదని, నాలుగో పాలసీని తెచ్చిందంటే ఈ 20 నెలల్లో అమలుచేసిన 3 ఇసుక పాలసీలు విఫలమైనట్లు భావిస్తున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని అన్నారు. టన్నుకు రూ.370 లకు అమ్ముతున్న ఇసుకను, రూ.470 లకు పెంచి అమ్మేలా జెపీ పవర్‌కు ఎందుకు కట్టబెట్టారో వివరణ ఇవ్వాలని, రూ.370 ప్రభుత్వానికి మరియు రూ.100

కాంట్రాక్టరుకు ఇచ్చే ప్రభుత్వం దేశంలో ఇదొక్కటేనని, టెండర్‌ ఖరారుచేసిన కంపెనీలో వైకాపాకు చెందిన ఎంపీలే భాగస్వాములగా ఉన్నారని కంపెనీ రికార్డులే చెబుతున్నాయని దీనిపై ప్రభుత్వం తక్షణమే వివరణ ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. ఈ ధర్నా లో నగర కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam