DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గురుమూర్తి ని 5 లక్షల మెజారిటీ తో తిరుపతి ఎంపీ గా గెలిపిద్దాం 

*కాళహస్తి వైకాపా యువనేత బియ్యపు పవిత్రా రెడ్డి పిలుపు* 

*తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైకాపా*

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*తిరుపతి / విశాఖపట్నం, మార్చి 23, 2021  (డి ఎన్ ఎస్):* రానున్న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ

అభ్యర్థి డా. గురుమూర్తి ని 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని శ్రీకాళహస్తి అధికార పార్టీ యువనేత  బియ్యపు శ్రీపవిత్ర రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతి పార్లమెంటు స్థానం పరిధి లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల లో

కన్వీనర్లు, కీలక నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట పట్టణంలో మండల స్థాయి వైసిపి బూత్ కన్వీనర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తా కష్టపడి పనిచేయడమే ప్రధాన

లక్ష్యమన్నారు. గత రెండేళ్ల కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమ పధకాలను ప్రజల్లో మరింత విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఏ ఎన్నిక ప్రభావం అక్కడే ఉంటుందని, తమకి ప్రతి ఎన్నిక కీలకమేనన్నారు. ముఖ్యంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక గెలుపును మొత్తం పార్టీ ఎంతో ప్రతిష్టగా తీసుకుందన్నారు. మరో ప్రక్క

ఇతర పార్టీ ల ప్రచారం ఎలా ఉన్నప్పటికీ తమ కార్యకర్తలు ప్రతి వీధి వీధి లోని ఇల్లిల్లు తిరిగి గురుమూర్తి విజయానికి కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు. 

ఈ సమావేశానికి తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి తో పాటు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam