DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరెన్సీ నోటు పై అంబెడ్కర్ చిత్రం ముద్రించాలి 

*లోక్ సభ లో అమలాపురం ఎంపీ చింతా అనురాధ* 

*(DNS రిపోర్ట్ :  పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 23, 2021  (డి ఎన్ ఎస్):* భారత కరెన్సీ నోటుపై డా. బీఆర్ అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ కోరారు. మంగళవారం లోక్ సభలో ఆమె మాట్లాడుతూ మొదటి ప్రపంచ యుద్ద సమయంలో

బ్రిటీషు పాలనలో భారతదేశం ఆర్థిక సంక్షోభానికి గురైందని, దాని నుండి బయటపడటానికి ఇంపీరియల్ బ్యాంక్ 1921ను ఏర్పాటు చేయడం జరిగినప్పటికీ అది ఒక విఫల ప్రయత్నంగానే మిగిలిపోయిందని తెలిపారు. అయితే ఆ సమయంలో డా.బీఆర్ అంబేద్కర్ గారు క్షీణిస్తున్న రూపాయి విలువను గురించి, దాని వలన సామాన్యుడి జీవనం ఎలా దుర్భరమౌతుందో, ఆర్థికంగా

భారతదేశం ఎలా పతనమౌతుందో బ్రిటీషు వాళ్లకు తెలియజెప్పే పోరాటం చేసి సఫలీకృతులయ్యారు. అందుకు పరిష్కారంగా 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా'ను ఏర్పాటు చేయాలని "హిస్టరీ ఆఫ్ ఇండియన్ కరెన్సీ అండ్ బ్యాంకింగ్" అని ఆయన రాసిన పుస్తకం ద్వారా 'హిల్టన్ కమిషన్' కు సిఫారసు చేయడం జరిగిందని అన్నారు. బ్రిటీషు వారు ఆ బాధ్యతను సైమన్

కమిషన్ కు బదిలీ చేశారని, సైమన్ కమిషన్ 3 రౌండ్ టేబుల్ సమావేశాలలో చర్చలు జరిపి రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేయడాన్ని ఆమోదించిందని, అప్పటి కేంద్ర శాసన సభ డా. బీఆర్ అంబేద్కర్ గారి సూచనలను క్రోడీకరించి RBI చట్టం, 1934 ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తదనంతర కాలంలో 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం

ద్వారా రిజర్వ్ బ్యాంకును జాతీయం చేయడం జరిగిందని ఎంపీ గారు గుర్తు చేశారు. 
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే గొప్ప ఆశయంతో మేధో మధనం చేసి రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని సంకల్పించి, అందుకు తగిన పోరాటం జరిపి సాధించిన ఆ దార్శనికుడి చిత్ర పటాన్ని ఏదైనా భారత కరెన్సీ నోటు పైన ముద్రించి, జాతిపిత మహాత్మాగాంధీ

గారితో సమాన గౌరవం ఇవ్వాలని కోరుతూ, ఇప్పటికైనా అందుకు తగిన చర్యలు తీసుకోవాలని మాట్లాడటం జరిగింది.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam