DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత సుప్రీంకోర్టు 48 వ చీఫ్ జస్టిస్ గా ఎన్ వి రమణ?

*తెలుగు వారికీ దేశంలోనే అత్యున్నత గౌరవం.*  

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 24, 2021  (డి ఎన్ ఎస్):* భారత దేశ అత్యున్నత న్యాయాధికారిగా తెలుగువారికి గౌరవం దక్కనుంది. ప్రస్తుతం సుప్రీం కోర్టు జస్టిస్ గా సేవలు అందిస్తున్న జస్టిస్ ఎన్ వి రమణ కు భారత దేశం

అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు 48 వ ప్రధాన న్యాయాధికారిగా భాద్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్న బోబ్డే  ఏప్రిల్ 23 న పదవి విరమణ చెయ్యనున్నారు. తన వారసునిగా రమణ పేరును బోబ్డే  భారత రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ కు సిఫార్సు చేసినట్టు సమాచారం. 
న్యాయశాఖా అంగీకారం

తదుపరి రాష్ట్రపతికి అందిన వెంటనే ఈయన పేరును ఖరారు చెయ్యనున్నారు. ఎటువంటి అభ్యంతరాలు రానట్టయితే. .. భారత దేశ 48 వ ప్రధాన న్యాయాధికారిగా ఎన్ వి రమణ భాద్యతలు చేపట్టనున్నారు. ఎన్నో కేసులను సానుకూలంగా వివాదరహితంగా పరిష్కరించడంలో రమణ అందరి మన్ననలు అందుకున్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam