DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కనక మహాలక్ష్మి గుళ్లో కోవిడ్ నిబంధనలు తక్షణం అమలు

*మాస్క్ లేనిదో నో ఎంట్రీ, ప్రవేశం కేవలం లాగా దర్శనమే..*

*పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు ప్రవేశం లేదు*   

*(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 24, 2021  (డి ఎన్ ఎస్):*  కోవిడ్ మరోసారి విజృంభిస్తున్న తరుణంలో విశాఖ పట్నంలోని బురుజు పేటలో గల

శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం లో భక్తులకు  కొన్ని నిబంధనలు విధించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్. జ్యోతి మాధవి తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖా విధించిన ఈ నిబంధనలు తక్షణం అమలు లోకి రానున్నాయి. భక్తులకు కేవలం లఘు దర్శనం మాత్రమే లభించనుంది.   

10 సంవత్సరాల లోపు చిన్నారులను, 60

సంవత్సరాల పైబడిన వృద్ధులను, గర్భిణీ మహిళలను, ఆలయంలోకి దర్శనం కోసం అనుమతించడం లేదు.

ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ముఖానికి మాస్క్ ధరించాలి, మాస్క్ లేని వారికి ఆలయ ప్రవేశం లేదన్నారు. 

ప్రవేశ మార్గం వద్ద కాళ్ళు కడుక్కొని, అక్కడే శానిటైజేషన్ చేసుకుని మాత్రమే క్యూ లైన్ లోకి

వెళ్లాలన్నారు. 

జ్వరం, జలుబు, దగ్గు ఉన్న భక్తులకు ప్రవేశం నిషేధం అన్నారు. 

ప్రతి ఒక్కరూ తమ వెంట ఆధార్ కార్డు, లేదా ఇతర గుర్తింపు కార్డు ఒరిజినల్, జిరాక్స్ కపి కూడా తీసుకు రావాలన్నారు. 

నిర్దేశించిన మార్క్ ల్లో మాత్రమే నిలబడి, దర్శనానికి వెళ్లాలన్నారు. 

ఆలయం లోపల ఎటువంటి

విగ్రహాన్ని తాకరాదు

అమ్మవారికి భక్తుల నుంచి ఎటువంటి నైవేద్యం అనుమతించబడదు. ఇతరులకు పంపిణీ చేయరాదు. దేవస్థానం వారు ప్యాకెట్ల లో మాత్రమే ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam