DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామిని వేడుకున్నా: మల్లాది

*టిటిడి ట్రస్ట్ ఆహ్వానితునిగా మల్లాది విష్ణు ప్రమాణ స్వీకారం*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 25, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తిరుమల శ్రీనివాసుని కోరుకున్నట్లు బ్రాహ్మణా కార్పొరేషన్ చైర్మన్, విజయవాడ సెంట్రల్

శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. గురువారం తిరుమల శ్రీవారి దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన ఆయన  గురువారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని జయవిజయుల వద్ద అదనపు ఈవో ఎవి

ధర్మారెడ్డి ఉదయం 7 గంటలకు మల్లాది విష్ణు తో ప్రమాణం చేయించారు. అనంతరం అధికారులు ఆయనకు స్వామివారి దర్శనం చేయించారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వాదం చేశారు. ధర్మారెడ్డి ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటం అందించారు.

టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా తనను నియమించిన ముఖ్యమంత్రి

వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి విష్ణు కృతజ్ఞతలు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam