DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా పట్ల మరింత అప్రమత్తత అవసరం: రాజమండ్రి ఎంపీ భరత్ 

*కేంద్ర మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు పాటించాలని పిలుపు*

*రాజమండ్రి ఆసుపత్రి లో డా. ఆకుల చే ఎంపీ కి టీకా అందజేత* 

(DNS రిపోర్ట్ : పి. రాజా,  బ్యూరో చీఫ్, అమరావతి )  

అమరావతి, మార్చి 26, 2021 (డి ఎన్ ఎస్ ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ కరోనా వైరస్ పట్ల

ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు, వైకాపా పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపి భరత్ రామ్ శుక్రవారం వైద్యుల పర్యవేక్షణలో మాజీ ఎమ్మెల్యే డా. ఆకుల సత్యనారాయణచే కరోనా వాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా కోవిడ్

పరిస్థితులపై వైద్య అధికారులతో ఎంపీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఎంపి భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం కేంద్రంగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో వైద్య అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. 
రాజమహేంద్రవరం నగరంలో 351 కేసులు రావడంతో పాటు ఒక ప్రయివేట్

విద్యా సంస్థలో 163 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ తరుణంలో ప్రజలంతా గతంలో అనుసరించిన విధానాల్లో భాగంగా భౌతికదూరాన్ని పాటించడంతో పాటు మాస్క్, శానిటైజర్లను వినియోగించడంతో పాటు మరిన్ని జాగ్రత్తలు చేపట్టాలని కోరారు.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల స్ట్రెయిన్స్ వస్తున్నాయన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత

అప్రమత్తంగా ఉండాలన్నారు. 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు  వ్యాక్సిన్ అందరికి అందుబాటులోకి తెచ్చారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజమహేంద్రవరం కేంద్రంగా26 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేయడం

జరిగిందని తెలిపారు. 

ప్రజల్లో కోవీషీల్డ్ పట్ల కొన్ని అపోహలు ఉన్నాయని, ఆ అపోహలను తొలగించేందుకే తాను ఈ వ్యాక్సిన్ వేయించుకున్నట్లు తెలిపారు. ఒక్కొక్క కేంద్రంలోనూ 50 చొప్పున రోజుకు  1300 మందికి, దీంతో పాటు కొన్ని ప్రయివేట్ ఆసుపత్రుల ద్వారా వెరసి 3,500 మందికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని

తెలిపారు. 

ఉభయ గోదావరి జిల్లాలకు వ్యాపార కేంద్రమైన రాజమహేంద్రవరాన్ని హాట్ స్పాట్ గా ఉన్నందున మరిన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలంతా మన వంతు బాధ్యతగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ కరోనాను ఎదుర్కొవాలని ఆయన పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య సేవల సమన్వయ

డాక్టర్ అధికారి రమేష్ కిషోర్, అదనపు డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కోమల, ఆసుపత్రి సూపరింటెండెంట్ సోమసుందర్, ఎంహెచ్ఓ వినూత్న, డాక్టర్ పద్మశ్రీ,
తదితరులు పాల్గొన్నారు. సమీక్ష డాక్టర్ రమేశ్ కిశోర్ అధ్యక్షతన జరిగింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam