DNS Media | Latest News, Breaking News And Update In Telugu

27 న సప్త విభిన్న ప్రత్యేక ఏకపాత్రాభినయ ప్రదర్శనలు 

*రంగసాయి నాటక సంఘం చే ప్రపంచ రంగస్థల దినోత్సవం*

(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)  

విశాఖపట్నం , మార్చి 26, 2021, 2020 (డి ఎన్ ఎస్ ): ప్రపంచ రంగస్థల దినోత్సవం పురస్కరించుకొని విశాఖకు చెందిన ప్రముఖ రంగస్థల నాటక సంస్థ రంగసాయినాటక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 27న శనివారం ఉదయం 10 గంటలకు  టి.ఎస్.ఆర్ .

కాంప్లెక్స్ , వైభవ్ జ్యూయలర్స్ ఎదురుగా ఉన్న రంగసాయి నాటక గ్రంథాలయం వేదికగా ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు రంగసాయి నాటక సంఘం, నాటక గ్రంథాలయం వ్యవస్థాపకులు బాదంగీర్ సాయి ఒక ప్రకటనలో తెలియజేశారు.
ప్రపంచ రంగస్థల దినోత్సవం వేడుకల్లో భాగంగా వివిధ నాటకాల ముఖ్య సన్నివేశాలు ఆధారంగా రంగస్థల

కళాకారులు నటించే మొత్తం 7 ప్రత్యేక  ఏకపాత్రాభినయ ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఏకపాత్రాభినయ ప్రదర్శనలలో మొదటగా “అల్లూరి సీతారామరాజు” నాటకంలో అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం వై.వి.కృష్ణా రావు ప్రదర్శిస్తారని. రెండో ప్రదర్శనగా “ప్లాస్టిక్ భూతం” నాటిక సన్నివేశంలో ఒక పాత్రను నటుడు, గిన్నిస్

వర్డల్డ్ రికార్డ్ హోల్డర్ కోరుకొండ రంగారావు  ప్రదర్శిస్తారని. మూడో ప్రదర్శనగా' రక్త కన్నీరు ' నాటకంలో ముఖ్యమైన గోపాల్  పాత్రను ప్రముఖ రంగస్థల కళాకారులు  కె.అబ్రహం ప్రదర్శన చేస్తారని. నాలుగవ ఏకపాత్ర ప్రదర్శనగా "కన్యాశుల్కం" నాటకంలో  'గిరీశం' పాత్రను విశాఖకు చెందిన ప్రముఖ రంగస్థల కళాకారుడు  కె.

శ్రీనివాస్ ప్రదర్శన చేస్తారని. ఐదవ ఏకపాత్ర ప్రదర్శనగా  'రైతు ఆవేదన' ఏకపాత్రను రంగస్థల కళాకారులు హుష్ కాకి అప్పారావు ప్రదర్శిస్తారని. ఆరోవ ప్రదర్శనగా “సగటు మనిషి”  ఏకపాత్రను పి.అన్వేష్ ప్రదర్శిస్తారని. ఏడో ప్రదర్శనగా “రాణి రుద్రమదేవి” ఏకపాత్రాభినయంను కుమారి కె.జోషిత ప్రదర్శన చేస్తారని తెలిపారు.  
/> ఈ ఏకపాత్ర అభినయ ప్రదర్శనల కార్యక్రమానికి నాటకాభిమానులు, నగర ప్రజలు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రపంచ రంగస్థల దినోత్సవం వేడుకలను విజయవంతం చేయవలసిందిగా బాదంగీర్ సాయి కోరారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam