DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా దెబ్బకు ఎయిర్ ఇండియా నష్టం రూ.10 వేల కోట్లు 

*రాజమండ్రి ఎంపీ భరత్ ప్రశ్నకు కేంద్రమంత్రి పూరి జవాబు* 

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 26, 2021 (డిఎన్ఎస్):* 2020-21 కాలంలో కరోనా పేరు చెప్పి రూ.పది వేల కోట్ల నష్టం వచ్చిందంటూ సాకుతో ఎయిర్ ఇండియా సంస్ధ ను అమ్మేస్తున్నారా అంటూ రాజమహేంద్రవరం లోక్ సభ ఎంపీ మార్గాని భరత్ రామ్

లోక్ సభ సమావేశంలో ప్రశ సంధించారు. దీనిపై విమానయాన మంత్రి హరదీప్ సింగ్ పూరీ ఔను నిజమే కరోనాతో ఎయిర్ లైన్స్ కు ఎయిర్ ఇండియాకు సైతం కోలుకోలేని నష్టం సంభవించిందన్నారు.

ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఎయిర్ ఇండియా రాకపోకలు అధిక కాలం నిలిపి వేయడంతో పాటు దేశ విదేశాల్లో ఇరుక్కున్న వారికోసం  చార్టర్లు, వందేభారత్

మిషన్ ఫ్లైట్స్ పేరిట భారీ ఎత్తున విమానాలు నడిపిందన్నారు.

ఫలితంగా ఆదాయం లేక భారంగా ఉన్నదశలో వ్యాధి నేపధ్యంలో విమానాలు తప్పనిసరై నడిపిన క్రమంలో కచ్చితంగా ఆ ఒక్క ఏడాదిలో అక్షరాలా రూ.9979 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందన్నారు.

సంస్ధ స్ధితి ఇంత దయనీయంగా ఉన్నా భరోసా ఇస్తూ కేంద్ర ప్రభుత్వం రూ.964 కోట్లు

వివిధ బ్యాంకుల నుంచి కొత్త వర్కింగ్ క్యాపిటల్ గా రుణం ఇప్పించిందన్నారు. అదే కేంద్రం ఇంకా చొరవ తీసుకుని మరో రూ.6693 కోట్లు రుణంతో పాటు 816 మిలియన్ యూఎస్ డాలర్ల రీ ఫైనాన్సింగ్ రుణం.

జాతీయ చిన్నమొత్తాల పొదుపు సంస్ధ నుంచి రూ.4500 కోట్ల రుణం ఒకే ఏడాదిలో  ఏకకాలంలో రుణాన్ని సంస్ధ మనుగడను దృష్టిలో పెట్టుకుని

ఇప్పించిందన్నారు.

ప్రిలిమనరీ ఇన్ఫర్మేషన్ మెమొరాండం ప్రకారం గతాన్ని... వర్తమానాన్ని బేరీజు వేస్తూ రుణాలపై అప్పులు... వడ్డీలు...చక్రవడ్డీలతో సంస్ధ కుదేలై ఉందనీ... అందువల్ల మెరుగైన చర్యలు తీసుకునేందుకు వీలుగా క్వాలిఫైడ్  ఇంట్రస్టెడ్ బిడ్డర్స్ కు సంస్ధను  అప్పచెప్పడం శ్రేయస్కరమన్న సిఫార్స్ కు తలొగ్గ

వలసిన అవసరం ఏర్పడుతోందని సుదీర్ఘ సమాధానం ద్వారా వివరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam