DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మార్చి 31 నుండి ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు

*(DNS రిపోర్ట్: ఆచార్యులు SV, బ్యూరో చీఫ్, శ్రీకాకుళం )*  

*శ్రీకాకుళం, మార్చి 27, 2021 (డిఎన్ఎస్):*  ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 31 నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణపై శనివారం జిల్లా

కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 81 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలో నాలుగు విడతల్లో జరుగుతాయని పేర్కొన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 నుండి 5 గంటల

వరకు జరుగుతాయని చెప్పారు. ఈ పరీక్షలు నిర్వహణలో కోవిడ్ నియమ నిబంధనలు పక్కాగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా చేయాలని ఆయన అన్నారు. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తిలో ఉన్నందున చర్యలు కట్టుదిట్టం చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్

ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో చేరుటకు ఆర్టీసీ బస్సులను నడపాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రాక్టికల్ నిర్వహించే సమయంలో ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఈపీడీసీఎల్ అధికారులను ఆయన ఆదేశించారు. విద్యార్థులకు ఎటువంటి

అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆర్ఐఓ ఎస్.రుక్మాంగధ రావు మాట్లాడుతూ ప్రాక్టికల్ పరీక్షలకు 14,819 మంది ఎంపీసీ విద్యార్థులు, 6,685 మంది బైపీసీ విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. పరీక్ష పత్రాలు ఆన్లైన్లో ఏరోజుకారోజు వస్తాయని ఆయన చెప్పారు. ప్రాక్టికల్ పరీక్షలు శ్రీకాకుళం, పలాస, ఎచ్చెర్ల, కింతలి,

టెక్కలి, నౌపడ, పలాస, కాశిబుగ్గ, పూండి, రణస్థలం, లావేరు, కొయ్యం, రాజాం, పొందూరు, జి.సిగడాం, కోటబొమ్మాలి, నరసన్నపేట, పోలాకి, ఆమదాలవలస, సీతంపేట, పాలకొండ, హిరమండలం, భామిని, కొత్తూరు, మెలియాపుట్టి, పాతపట్నం, సోంపేట, వీరఘట్టం, కంచిలి, బారువ, ఇచ్చాపురం, సంతకవిటి, వంగర, హరిపురం, మందస, సరుబుజ్జిలి, తొగారాం, సారవకోట కేంద్రాల్లో

జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
      ఈ సమావేశంలో అదనపు డిఎంహెచ్ఓ డా.బి.జగన్నాథ రావు, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి కే ప్రకాష్ రావు, ఉప విద్యాశాఖ అధికారి గార పగడాలమ్మ, కమిటి సభ్యులు ఆర్. సత్యనారాయణ, బి ప్రసాదరావు, కే. తవిటి నాయుడు బీ.శ్యామసుందర్, ఇపిడిసిఎల్ ఏడిఇ చక్రవర్తి, ఎస్ఐ పి. పారి నాయుడు తదితరులు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam