DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆదివాసీ గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియాలోనే ఉండాలని వినతి

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 27, 2021, 2020 (డిఎన్ఎస్):* విఎంఆర్డిఏ (విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ) లో విలీనం చేసిన షెడ్యూల్డ్ & నాన్ షెడ్యూల్డ్  ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలోనే ఉండాలని కోరుతూ పాడేరు ఆర్డిఓ లక్ష్మీ శివ జ్యోతి కి శనివారం ఆదివాసి

జేఏసి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసి JAC జిల్లా కన్వీనర్ రామారావు దొర, జేసీ సలహాదారులు సోనారి గంగరాజు, JAC జిల్లా కో కన్వీనర్లు సుర్ల అప్పారావు, కూడా రాధాకృష్ణ , జవ్వాది  సూర్యనారాయణలు మాట్లాడుతూ ఈ గ్రామలను వి ఎం ఆర్ డి ఎ పరిధిలో కలిపితే  ఆదివాసులు తమ చట్ట పరమైన హక్కులు కోల్పోవాల్సి వస్తుందని

వివరించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఆదివాసులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని, తక్షణమే ప్రభుత్వం విరమించుకోవాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వి ఎం ఆర్ ఎ లో కలిపే నాన్ షెడ్యూల్ ఆదివాసీ గ్రామాలను  షెడ్యూల్ ఏరియాలో విలీనం చేయదానికి ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసిందని వారు అన్నారు.
అలాగే 5 షెడ్యూల్, 1/70 భూ

బదలాయింపు నిషేధ చట్టం, పెసా చట్టం ఉద్దేశాలను ఈ ప్రీతి పులకరిస్తూ ఏజెన్సీ ముఖద్వారంలో హోర్డింగులు ఏర్పాటు చేయాలని ఆర్డీవోను కోరారు. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసే తరులు   అక్రమ కట్టడాలను రోజు రోజు రెచ్చి పోతున్నారని, వారిపై వెంటనే  చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam