DNS Media | Latest News, Breaking News And Update In Telugu

‌27 న రాత్రి 8.30 నుంచి గంట విద్యుత్ దీపాలను కట్టండి

రాత్రి 8.30 నుంచి గంట విద్యుత్ దీపాలను కట్టండి  

27 ‌న  ప్రపంచ ఎర్త్‌ అవర్ ‌ను జయప్రదం చేయండి.

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 27, 2021, 2020 (డిఎన్ఎస్):* ఎర్త్‌ అవర్‌ సందర్భంగా ఈ నెల 27వ తేదీ రాత్రి 8:30 నుండి 9:30 గంట వరకు స్వచ్ఛందంగా విద్యుత్తు దీపాలను

నిలుపుదల చెయ్యాలని జి.వి.ఎమ్‌.సి. యు.ఎన్‌.డి.పి. విభాగం, గ్రీన్‌ క్లైమేట్‌ కోరుతున్నారు. ప్రకృతిని రక్షించేందుకు ఒక గంట సమయం విద్యుత్ దీపాలను నిలుపుదల చేసి మన భూగోళం భవిష్యత్తును కాపాడే ప్రయత్నం చేద్దాం అన్నారు. ప్రతి ఏడాది ఎర్త్‌ అవర్‌ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. 
ఈ కార్యక్రమంలో జి.వి.ఎమ్‌.సి.

యు.ఎన్‌.డి.పి. విభాగం ప్రోగ్రాం ఆఫీసర్‌ డి. రవికుమార్‌ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు వారికి అవసరం లేని విద్యుత్‌ దీపాలను ఇతర విద్యుత్‌ పరికరాలను మార్చి 27వ తేదీన రాత్రి 8:30 నుండి 9:30 వరకు ఆపివేయడం ద్వారా వారి భాగస్వామ్యాన్ని వారికి భూగ్రహం మీద ఉన్న బాధ్యతను తెలియ జేయవచ్చునన్నారు. ఈ కార్యక్రమం ప్రతి

ఏటా మార్చి నెలో ఆఖరు శనివారం జరుపబడుతుంది, ప్రజలో భూతాపం వన కలిగే నష్టాపై అవగాహన కలిగిస్తుందని అన్నారు.

గ్రీన్‌ క్లెమేట్‌ టీమ్‌ వ్యవస్థాపకులు జె.వి. రత్నం మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయన్నారు. ‘‘ఎర్త్‌ అవర్‌’’ కార్యక్రమంలో భాగస్వామ్యం చాలా సులభం. ప్రతి

ఏటా ఒక నిర్ణీత సమయంలో నిర్ణయించబడుతుంది. ఆ నిర్ణీత సమయంలో అందరూ వారు వినియోగించని, విద్యుత్‌ దీపాను, విద్యుత్‌ పరికరాను ఆపివేయండి. పిల్లలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేయండి ఇంకా చాలా ఇతర మార్గా ద్వారా మీ మద్దతును తెలియజేయ వచ్చునని అన్నారు.
ఈ కార్యక్రమంలో జి.వి.ఎమ్‌.సి. యు.ఎన్‌.డి.పి. ప్రాజెక్ట్‌

అసోసియేట్స్‌ ఇ. శశికళ, పి. భారతి, బి. మంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam