DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏప్రిల్ 1 నుండి ఏపీ లో ఒంటిపూట బడులు నడుస్తాయి

*ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి.*

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 27, 2021 (డిఎన్ఎస్):* : రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుండి ఒంటిపూట బడులను నిర్వహించాలని, అనంతరం మధ్యాహ్న భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యా శాఖ

అధికారులను ఆదేశించారు. ప్రతీ రోజూ ఉదయం 07.40గం.ల నుండి మధ్యాహ్నం 12.30గం.ల వరకు తరగతులు నిర్వహించాలని, ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ తప్పనిసరి అని, ఉపాధ్యాయులు విధుల నిర్వహణపై సంయుక్త కలెక్టర్ తనిఖీలు చేయాలని మంత్రి తెలిపారు.  కోవిడ్ దృష్ట్యా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సానిటైజేషన్ చేసుకుంటూ,

సబ్బుతో పరిశుభ్రం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ పై విస్తృత ప్రచారం, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఒంటిపూట బడుల నిర్వహణ తదితర అంశాలపై మంత్రి విద్యాశాఖ కమీషనర్ చినవీరభద్రయ్య, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు వెట్రి సెల్వీలతో కలిసి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
ఈ సందర్భంగా మంత్రి

మాట్లాడుతూ గతేడాది కోవిడ్ వలన ఆన్ లైన్ తరగతులు జరిగాయని, ఈ ఏడాది నిరంతరాయంగా తరగతులను నిర్వహించిన రాష్ట్రంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమస్థానంలో నిలిచిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విద్యార్ధుల ఆరోగ్య భద్రతను కాపుడుతూ ఎక్కడ రాజీపడకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు.

అయినప్పటికీ కొన్ని చోట్ల కోవిడ్ కేసులు వస్తున్న దృష్ట్యా ఉపాధ్యాయులు మరింత పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆరోగ్య విద్యా ప్రసార కార్యక్రమాలను గ్రామస్థాయిలో, పట్టణాల్లో విస్తృతంగా నిర్వహించాలని అన్నారు. ఇప్పటికే కోవిడ్ పై ప్రజల్లో అవగాహన పెరిగిందని, సెకెండ్ వేవ్ వస్తున్న తరుణంలో దానిపై మరింత అవగాహన

కల్పించాలని, ముఖ్యంగా విద్యార్ధుల తల్లితండ్రులకు కోవిడ్ పట్ల అప్రమత్తం చేయాలని చెప్పారు. రాష్ట్రంలో కొద్దిగా కేసులు పెరుగుతున్నందన ప్రతీ ఒక్కరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని, దేశంలోనే అత్యధిక కోవిడ్ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముందందని మంత్రి స్పష్టం చేసారు. కోవిడ్ పై అన్ని పాఠశాలలు,

కె.జి.బి.విలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన పెంపొందించాలని, అన్ని చోట్ల ప్రతీ ఒక్కరూ కనీస నియమాలు తప్పనిసరిగా పాటించాలని వివరించారు. ప్రతీ పాఠశాలలో థర్మామీటర్లతో పాటు కోవిడ్ అవగాహన బ్యానర్లు, పోస్టర్లను సిద్ధం చేసుకోవాలని, ఇందుకు యం.ఆర్.సి నిధులను ఉపయోగించుకోవచ్చని మంత్రి తెలిపారు. ఎక్కడైనా కేసులు

వచ్చినట్లయితే తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రానున్న రెండు మాసాల్లో కోవిడ్ విస్తరించకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు ఇప్పటినుండే ప్రారంభించాలని మంత్రి పేర్కొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam