DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయనగరం దరి సుంకరిపేట లో బస్సులు ధీ, 5 గురి మృతి

*డంపింగ్ యార్డ్ పొగ, అతివేగం బస్సు ప్రమాదాలకు కారణమా?* 

*ఘటన స్థలి కి చేరుకున్న పొలిసు, ఇతర అధికార యంత్రాంగం.* 

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*విజయనగరం / అమరావతి, మార్చి 29, 2021 (డిఎన్ఎస్):* విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై సోమవారం ఉదయం రెండు బస్సులు

ఢీకొట్టిన జరిగిన రోడ్డు ప్రమాదం లో ఐదురుగు మృత్యువాత పడ్డారు. దీనికి ప్రధాన కారణంగా సమీపంలోని డంపింగ్ యార్డ్ లో చెత్త తగులబెట్టడంతో దట్టమైన పొగ రావడం అదే సమయంలో రెండు బస్సులు అతివేగంగా రావడంతో దారి కనపడక ఢీకోట్టినట్టు ప్రాధమిక అంచనాలు ఉన్నాయి. ఎదురెదుగా వస్తున్న రెండు ఆర్టీసి బస్సులు ఢీ కొట్టడం, ఒక ఆర్టీసీ

బస్సును వెనుక నుంచి  మరో లారీ ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రతరం అయ్యింది. ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లతో పాటు ఇద్దరు ప్రయాణీకులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు,భయానకంగా మారిన ఘటనా స్థలం మారింది. డంపింగ్ యార్డ్ దట్టమైన పొగ అలుముకోవడంతో పాటు అతి వేగమే ప్రమాదానికి కారణంగా చెపుతున్న స్థానికులు. 

విజయనగరం

మండలం సుంకరిపేట జంక్షన్ వద్ద రెండు ఆర్టీసి బస్సులు ఎదురెదురు గా ఢీ కొన్న సంఘటన స్థలాన్ని విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, సందర్శించి, క్షతగాత్రులను వాహనాల్లో నుండి బయటకు తీయించి, చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, సహాయక చర్యలు చేపట్టారు. సహాయక చర్యల్లో 5వ బెటాలియన్ కమాండేంట్ జే.కోటేశ్వర రావు,

విజయనగరం డిఎస్పీ పి.అనిల్ కుమార్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎ ఆర్ డిఎస్పీ శ్రీ ఎల్.శేషాద్రి మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam