DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ చే వేదమాత కు ఆత్మీయ పట్టాభిషేకం

*భారత పరిక్రమణ పాల్గొన్న పండితులకు కృతజ్ఞతా సత్కారం*  

*వేదమాత అనుగ్రహం పొందిన వేదపండితులు సమ్మానం* 

*ఇకపై ప్రతి నెలా ఒక బస్సు ద్వారా వేద అధ్యాత్మిక యాత్ర చేపటాడతాం.*

*అందరికి సప్తఋషి ట్రస్ట్ సంస్థ నిర్వాహకులు మాధవశర్మ ఆహ్వానం* 

(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్,

విశాఖపట్నం)  

విశాఖపట్నం , మార్చి 26, 2021, 2020 (డి ఎన్ ఎస్ ): ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకూ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగిన సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ సారధ్యంలో చేపట్టిన భారత పరిక్రమణ శంకర యాత్ర దిగ్విజయంగా పూర్తి అయిన సందర్బంగా ఆత్మీయ కృతజ్ఞత సమాన సభ జరిగింది. సోమవారం విశాఖపట్నం లోని ద్వారకానగర్ లో గల పౌర

గ్రంధాలయంలో వేదమాతకు jarigin ఆత్మీయ పట్టాభిషేకం లో సంస్థ వ్యవస్థాపకులు మావిళ్ళపల్లి మాధవ శర్మ యాత్రా విశేషాలను తెలియచేసారు. యాత్ర లో పాల్గొన్న వేదపండితులు, సహకరించిన ఆత్మీయులకు సముచిత రీతిన సత్కారం, వేదపండితులు సంభావన, నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ . . . విశాఖపట్నం కు చెందిన సప్తఋషి చారిటబుల్

ట్రస్ట్ సారధ్యంలో చేపట్టిన భారత పరిక్రమణ శంకర యాత్ర ఫిబ్రవరి 14 న తన పాఠశాల నుంచి బయలు దేరి దేశంలో ఆదిశంకరులు చేపట్టిన భారత పరిక్రమణ యాత్రను అనుసరించామన్నారు. ఈ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదములు తెలియచేసారు. ఈ యాత్రలో తమకు ఎన్నో అనుభవాలు కలిగాయని, ఎందరో మహానుభావుల సందర్శన భాగ్యం లభించిందన్నారు.

వారందరిని స్మరించుకుంటూ వారికి సభాపూర్వకంగా పెద్దల సమక్షంలో ధన్యవాదములు తెలియ చేసారు. 

ప్రతి నెలా ఒక యాత్ర చేపడతాం. . .:

తమ వేదపాఠశాల ఆరంభించిన ఈ భారత పరిక్రమణ యాత్ర ఇక్కడితో ఆగిపోకుండా. . .ఇక పై ప్రతి నెలా ఒక బస్సు లో వేదపండితులు, సిబ్బంది తో కూడిన బృందం ఒక పుణ్యక్షేత్ర యాత్ర చేస్తుందని మాధవ శర్మ

తెలిపారు. ఆసక్తి కల్గిన భక్తులు ఈ బస్సులో వెళ్ళవచ్చన్నారు. 

జరిగిన యాత్ర. .వివరాలు.:

ఆదిశంకరాచార్యులు చేపట్టిన వేదయాత్ర స్ఫూర్తిగా 30 రోజుల పాటు నాలుగు వేదాల పారాయణలతో భారత దేశ ఆలయాలను సందర్శించనున్నట్టు తెలిపారు. ఈ యాత్రకు ఫిబ్రవరి 14 న శ్రీకారం చుట్టామని వివరించారు. ఈ యాత్ర లో ఒక్కక్క వేద పండిత

బృందం ఒక్కో దిశలో ప్రయాణిస్తుందన్నారు. ఋగ్వేద,  కృష్ణ, శుక్ల యజుర్వేద, సామవేద, అధర్వ వేద పండితులు ఒక్కో దిశలోని ఆలయాలను సందర్శిస్తూ అక్కడ ఆయా వేద ఋక్కులను పఠనం చెయ్యడం జరుగుతుందన్నారు. 

భారత దేశ తూర్పు భాగం (1 - 3 ) : సంపూర్ణ ఋగ్వేద పారాయణం.  
భారత దేశ దక్షిణ భాగం (3 - 5 ) : సంపూర్ణ శుక్ల యజుర్వేద పారాయణం. 
/> భారత దేశ దక్షిణ భాగం (5 - 7 ) : సంపూర్ణ కృష్ణ యజుర్వేద పారాయణం. 
భారత దేశ పశ్చిమ భాగం (7 - 9 ) : సంపూర్ణ సామవేద పారాయణం. 
భారత దేశ ఉత్తర భాగం (9 - 11 ) : సంపూర్ణ అధర్వ  వేద పారాయణం. 
 
సప్త ఋషి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మావిళ్ళపల్లి మాధవ శర్మ కృష్ణ యజుర్వేద స్మార్త పండితుల నేతృత్వం లో సాగుతున్న ఈ వేదం యాత్ర లో

 పాల్గొనే వేదపండితులు వీరే: . . 

ఋగ్వేదం : శ్రీదత్త శర్మ ఘనపాఠి  (విశాఖపట్నం), జి. కల్యాణ చక్రవర్తి ఘనపాఠి ( తిరుపతి)

శుక్ల యజుర్వేదం: కీలంబి రాఘవాచార్యులు - కాణ్వశాఖ  ( హైద్రాబాద్),  కుమార భారత సుబ్రహ్మణ్యాచార్యులు - కాణ్వశాఖ ( హైద్రాబాద్)

కృష్ణ యజుర్వేదం: జి. అరవింద కుమార్ ఘనపాఠి (

తిరుపతి), సన్నిధానం దీక్షితులు ఘనపాఠి ( హైద్రాబాద్).

సామవేదం : శ్రీనివాస్ జోషి ( హైద్రాబాద్). జీవం కుమార్ ( హైద్రాబాద్)

అధర్వ వేదం: రావూరి విజయ్ కుమార్ శర్మ ( గుంటూరు), అమన్ కుమార్ పాండే ( హైద్రాబాద్).
 
ఇరగవరపు హరీష్ శర్మ ( కృష్ణ యజుర్వేద స్మార్తం, విశాఖ),
పాణిగ్రాహి కౌండిన్య శర్మ ( కృష్ణ యజుర్వేద

స్మార్తం, విశాఖ),
పేరెపు శశికాంత్ శర్మ ( కృష్ణ యజుర్వేద స్మార్తం, విశాఖ), 

సప్తఋషి  వేద సంస్కృత పాఠశాల,  సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయం, సంపత్ వినాయకగర్ ఆలయం, కాళీమాత గుడి, ఇసుక కొండ సత్యనారాయణ స్వామి ఆలయం, సప్త ఋషీశ్వర ఆలయం, శివానందమూర్తి ఆశ్రమం, అరసవల్లి సూర్య దేవాలయం, శ్రీకూర్మం

క్షేత్రం, శ్రీముఖలింగం, కోణార్క్, పూరి లోని శ్రీ జగన్నాధ స్వామి ఆలయం, సిరసపల్లి లోని చింతామణి గణపతి ఆలయం, అనకాపల్లి గౌరీపరమేశ్వర ఆలయం, తుని తపోవనం స్వామిజి ఆశ్రమం, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం, కృష్ణానది, విజయవాడ దుర్గ గుడి, మంగళగిరి పానకాల లక్ష్మి నృసింహ స్వామి ఆలయం, శ్రీకాళ హస్తి ఆలయం, తిరుమల

క్షేత్రం

శుక్ల / కృష్ణ యజుర్వేదం: .. 

కంచి లోని విష్ణు వరదరాజ స్వామి ఆలయం, శివకంచి లోని కామాక్షి ఆలయం, కామకోటి పీఠం, అది శంకరాచార్య జన్మస్థానం కలది, గురువాయూర్, శ్రీనగేరి, శివమొగ్గ, కొల్హాపూర్, త్రయంబకేశ్వర, నాసిక్, ఓంకారేశ్వర, ఉజ్జయిని ( మహాకాళేశ్వర్), కాలభైరవ క్షేత్రం.

సామవేదం పారాయణ: 
/> ద్వారకా, కురుక్షేత్రం, శ్రీనగర్, శంకరాచార్య హిల్స్,  

అధర్వ వేద పారాయణ:

జమ్మూ, జాగేశ్వర్, అయోధ్య, గయా, వారణాసి, త్రిపుర, కలకత్తా, విశాఖపట్నం. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam