DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సామాన్య భక్తులకు స్వామి దర్శనం కోసం కదిలి వచ్చిన శారదా పీఠం

*ధర్మ జాగృతి కోసం స్వామిజనులతో శారదాపీఠం తిరుమల యాత్ర* 

*భక్తుల గోవిందా నామం తో మారుమ్రోగిపోయిన విశాఖ వీధులు*

*గిరిజన, దళిత భక్తులందరితోను పీఠాధిపతులు శ్రీవారి దర్శనం*

*శారదా పీఠం సారధ్యంలో 25 బస్సుల్లో తిరుమలకు భక్త జనం*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

 

*విశాఖపట్నం, మార్చి 29, 2021, 2020 (డిఎన్ఎస్):* అతి సామాన్య భక్తులకు స్వామి దర్శనం కోసం విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు కదిలి రావడంతో సోమవారం విశాఖ నగరం భక్తుల గోవిందా నామం, జయ జయ ధ్వానాలతో మారుమ్రోగిపోయింది. ధర్మ జాగృతి కోసం స్వామిజనులతో శారదాపీఠం తిరుమల యాత్ర చేపట్టడం వెలది మంది భక్తుల కళ్ళల్లో ఆనందం

దర్శనమిచ్చింది. ఈ 25 బస్సులలోను కేవలం గిరిజన, దళిత భక్తులకు మాత్రమే అవకాశం కల్పించారు. వీళ్లందరి తో కలిసి పీఠాధిపతులు ఈ నెల 31వ తేదీన తిరుమల వేంకటేశ్వరుని దర్శనం చేసుకోనున్నారు.  

విశాఖ శ్రీ శారదాపీఠం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హిందూ ధర్మ ప్రచార యాత్ర తెలుగు రాష్ట్రాల్లో ముగియనున్న సందర్భంగా 25 బస్సుల్లో

వందలాది మంది దళిత, గిరిజనులను తిరుమలకు తీసుకెళ్లి వారికి వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యాన్ని కల్పించాలని పీఠాధిపతులు సంకల్పం చేసారు. దీనికై 29వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చినముషిడివాడలోని విశాఖ శ్రీ శారదాపీఠం వద్ద పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. తదుపరి 3.15 గంటలకు

సింహాచలేశుని తొలిపావంచా వద్ద ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర స్వామి టెంకాయ సమర్పణ చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam