DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టీకా, మాస్క్ రక్షణ కోసమే, నిర్లక్ష్యం వద్దు: డిఐజి రంగారావు

*అనకాపల్లి లో రూరల్ పోలీసుల అవగాహన. . .*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మార్చి 29, 2021 (డిఎన్ఎస్):* ప్రతి ఒక్కరూ కరోనా నిరోధక టీకా  వేయించుకోవాలని, మాస్క్ రక్షణ కోసమే, నిర్లక్ష్యం కూడదని విశాఖ రేంజ్ డిఐజి ఎల్ కె వి రంగారావు సూచించారు. సోమవారం విశాఖ శివారు ప్రాంతం

అనకాపల్లి లో విశాఖ జిల్లా రూరల్ పోలీసులు ప్రజలకు మాస్క్, టీకా ల వినియోగం పై అనకాపల్లి రింగ్ రోడ్డు, ఫోర్ రోడ్ జంక్షన్ మరియు ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతాల్లో అవగాహన కల్పించారు. వరుసగా మూడోవ రోజు ప్రజలకు కరోనా మహమ్మారి పై అవగాహన కల్పించినట్టు డీఐజీ ఎల్.కె.వి.రంగారావు తెలియచేసారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా

వ్యాప్తికి కట్టడికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని, మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని అత్యవసరం అయితే తప్ప  సమూహాల్లోకి వెళ్లకుండా సంయమనం పాటించాలని, పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు. 
ఈ అవగాహన లో అనకాపల్లి డిఎస్పి కె. శ్రావణి, అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్  సిబ్బంది

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam