DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎవరైనా, ఎంతటివారైనా అమ్మిరెడ్డి ఐపీఎస్ మార్క్ తప్పదు 

*సిఐకి ఫైన్ వేసి...మాస్క్ తొడిగిన గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి*

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 30, 2021  (డిఎన్ఎస్):* విధుల్లో నిబద్దత కల్గిన అధికారులు అతి కొద్దిమందే ఉంటారు. అలాంటివారిలో గుంటూరు జిల్లా ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి ఐపీఎస్ ఒకరు. దేశంలో కరోనా మళ్లీ

విజృభిస్తున్న నేపథ్యంలో అందరూ మాస్క్ వాడటం తప్పనిసరి అనే నిబంధన అమలు లో ఉంది. అయితే గుంటూరు అర్బన్‌ పరిధిలో మాస్కు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. ఎస్పీ అమ్మిరెడ్డి లాడ్జి కూడలి, ఎంటీబీ కూడలిలో స్పెషల్‌ డ్రైవ్‌లో పాల్గొన్నారు. లాడ్జి కూడలిలో తుళ్లూరు ట్రాఫిక్‌ సీఐ మల్లికార్జునరావు మాస్కు

ధరించకుండా అటుగా వెళ్లడం ఎస్పీ గుర్తించారు. వేంటనే సీఐని ఆగమని కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ తప్పని సరిగా మాస్క్ ధరించాలి మీరు ఎందుకు మాస్క్ ధరించలే అని ప్రశ్నించగా సీఐ హడావిడిలో మర్చిపోయాను సార్ అనిచెప్పారు. దీంతో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లి మల్లికార్జునరావుకు ఎస్పీ అమ్మిరెడ్డి జరిమానా

విధించి, స్వయంగా మాస్కు తొడిగారు.

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గా ఉన్న సమయంలో సైతం అమ్మిరెడ్డి అత్యంత కీలకమైన కేసులను  ప్రత్యక్షంగా పరిశీలించి, పరిష్కారం చూపించిన అధికారిగా అందరి మన్ననలు అందుకున్నారు. 

కరోనా వైరస్‌ ఉద్ధృతంగా వ్యాప్తిచెందుతున్న క్రమంలో పోలీసులు సైతం జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ

సూచించారు. మాస్కు ధరించని కారణంగా సీఐకి అపరాధ రుసుం ( ఫైన్ ) విధించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఎస్పీ స్వయంగా మాస్కు తెప్పించి సీఐకి తగిలించారు. అలాగే వాహనదారులను ఆపి, మాస్క్ ధరించకుండా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. మాస్కులు ధరించిన వారినే అనుమతించాలంటూ సమీపంలోని దుకాణదారులకు సూచించారు. వైరస్

వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్పీ సూచించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam