DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాస్కు లేని వాళ్ళకి రూ.250 ఫైన్‌ వెయ్యండి డీజీపీ: సవాంగ్

*కొవిడ్‌ నియంత్రణ పై జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశం* 

*ఆంధ్ర లో ఒక్కరోజులో మాస్క్ ఫైన్ రూ.17 లక్షలు వసూలు*

*(DNS రిపోర్ట్: పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)*  

*అమరావతి, మార్చి 30, 2021  (డిఎన్ఎస్):* కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ముఖానికి మాస్క్ లేకుండా తిరిగేవాళ్ళకి రూ. 250 జరిమానా

విధించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ జిల్లాల ఎస్పీ లకు ఆదేశాలు జారీచేశారు.  కొవిడ్‌ విస్తరణ, నియంత్రణ చర్యలపై వరుస సమీక్షలు చేస్తున్న ఈయన జిల్లాల ఎస్పీలు, విజయవాడ, విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మాస్క్‌లు లేకుండా బయటకు ఎవరొచ్చినా జరిమానా విధించకుండా వదిలి

పెట్టొద్దని ఆదేశించారు. 

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజు లోనే మాస్క్ ధరించకుండా తిరుగుతున్న 18,565 మంది నుంచి ఒక్క రోజులో రూ.17.34 లక్షలు ఫైన్  వసూలు చేసినట్టు తెలుస్తోంది. 

రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,327 మందికి ఫైన్‌ విధించగా, తర్వాత స్థానంలో ప్రకాశం 2,294, విజయవాడ సిటీ 2,106

చలానాలు రాశారు. అతి తక్కువగా విజయనగరంలో కేవలం 78 మందికి ఫైన్‌ విధించారు.  

కరోనా నివారణకు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టండి. మాస్క్‌ లేకుండా బయటికి వచ్చే వారికి జరిమానా విధించండి. వైరస్‌ వ్యాప్తికి కారకులయ్యేవారిని వదిలి పెట్టొద్దు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

సీరియ్‌సగా ఉన్నాయి. మనం(పోలీస్‌) కూడా అంతే శ్రద్ధగా పనిచేయాలి’’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్ని జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam